బచ్చన్నపేట, 11 : తెలంగాణ ప్రభుత్వం పేదలు కంటిచూపు విషయంలో బాధపడొద్దని చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో కంటివెలుగు రెండో విడుత సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎంపీపీ బావండ్ల నాగజ్యోతీ కృష్ణంరాజు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి, ఈనెల 18 నుంచి ప్రారంభించనున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రూ.200కోట్లతో ఈ కార్యక్రమం అమలు చేస్తుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 10లక్షల అద్దాలు పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పరీక్షలు చేసి తర్వాత అవసరమైన వారికి వెంటనే కళ్లద్దాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, ఆశవర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఆర్ఏ, రేషన్డీలర్లు తదితర అధికారులు అర్హులందరికీ అద్దాలు ఇప్పించాలన్నారు. వంద రోజుల ఈ కార్యక్రమంలో సంబంధిత వైద్యులు, అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తారని తెలిపారు. వారికి కనీస వసతులు కల్పించే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకోవాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోవాలని అవగాహన సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, జడ్పీ వైస్చైర్పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మీ అంజయ్య, తహసీల్దార్ వినయలత, మండల ప్రత్యేకాధికారి, డీఏవో వినోద్కుమార్, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, మండల వైద్యాధికారి సిద్ధార్థరెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు గంగం సతీశ్రెడ్డి, దూడల కనుకయ్యగౌడ్, పార్టీ మండల అధ్యక్షులు చంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్రెడ్డి, రాజు, శ్రీనివాస్, ఏవో విద్యాకర్రెడ్డి పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే రాజయ్య
చిల్పూరు/జఫర్గఢ్: కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది సమన్వయంతో విజయవంతం చేయాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. చిల్పూర్ మండల కేంద్రం, జఫర్గఢ్ ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం కంటి వెలుగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ మొదటి విడుత కంటి వెలుగు కార్యక్రమంలో 827బృందాలు పనిచేసి లక్షా 50వేల మందికి కంటి పరీక్షలు చేసినట్లు తెలిపారు. రెండో విడుతగా రాష్ట్ర వ్యాప్తంగా 1500 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కంటి వెలుగు పరీక్షలు చేసిన వెంటనే అవసరమైన వారికి కంటి అద్దాలు అందిస్తారని తెలిపారు. ఈ నెల 18 నుంచి ప్రారంభమై వంద రోజుల్లో కోటిన్నర మందికి కంటి పరీక్షలు చేయడమే లక్ష్యంగా సిబ్బంది పనిచేస్తారని తెలిపారు. మండలం, గ్రామస్థాయిల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. రేషన్ షాపులు, పంచాయతీ కూడళ్లలో సమాచార బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. చిల్పూరు ఎంపీపీ బొమ్మిశెట్టి సరితా బాలరాజు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, తహసీల్దార్ విమల, ఎంపీడీవో వేణుగోపాల్రెడ్డి, మండల వైద్యాధికారి రాజమౌళి, సర్పంచ్లు ఉద్దెమారి రాజ్కుమార్, బానోత్ రూప్లానాయక్, కందుల రఘుపతి, పుట్టా అంజలీదేవీ రవీందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కానుకంటి రవీందర్, జఫర్గఢ్ ఎంపీపీ రడపాక సుదర్శన్, జడ్పీటీసీ ఇల్లందుల బేబీ, వైస్ ఎంపీపీ కొడారి కనుకయ్య, ఎంపీడీవో శ్రీధర్స్వామి, తహసీల్దార్ స్వప్న, వైద్యాధికారి రాజు పాల్గొన్నారు.