జనగామ, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): కార్యకర్తలే కొండంత బలం..ప్రజలే నా బలగం అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ జనగామ మండల ఆత్మీయ సమ్మేళనం జిల్లా కేంద్రంలో శుక్రవారం జరుగగా, పార్టీ జనగామ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కోటిరెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల పార్టీ అధ్యక్షుడు బైరగోని యాదగిరిగౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమ్మేళనంలో సీఎం పంపిన సందేశాన్ని ఎమ్మెల్సీ చదివి వినిపించారు. జనగామ రూరల్ మండలంలోని 11 గ్రామాల (క్లస్టర్ పరిధి) నుంచి పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సభా ప్రాంగణం గులాబీమయమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు సాధించలేని చవటలు.. సన్నాసులు.. దద్దమ్మలైన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని గ్రామాలకు వస్తున్నారని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హ్యాట్రిక్ లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని, పార్టీ పటిష్టానికి కృషి చేస్తున్న వారికి వెన్నుదన్నుగా నిలిచి రాజకీయ భరోసా ఇవ్వడానికే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత శ్రేణులపై ఉందని సూచించారు. పార్టీలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరం సైనికుల్లా పనిచేయాలన్నారు. మత విద్వేషాలను సృష్టి స్తూ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీ, ప్రజలకు మేలు చేసే పథకాలు, కార్యక్రమాలు చేపట్టకపోగా ధరలను పెంచడంలో పోటీ పడుతోందన్నారు. అనేక సంక్షేమ పథకాలతో దేశం ఆచరించేలా సంస్కరణలు తెస్తున్న బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ప్రభుత్వంపై అనవసరంగా తప్పుడు ప్రచారం చేసి నా, విద్వేషాలను రెచ్చగొట్టినా ప్రజలు ఊరుకోరు.. ఖబడ్దార్ అని ముత్తిరెడ్డి హెచ్చరించారు. బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్ రెడ్డి మాదిరిగా ఎటుపడితే అటు వాగుతున్న వారికి కళ్ల ముందున్న జనగామ అభివృద్ధే నిదర్శమని అన్నారు.
‘జనగామ జిల్లా కేంద్రం ఆవిర్భవిస్తుందని.. ఇక్కడో అద్భుతమైన కలెక్టరేట్ నిర్మిస్తామని.. మెడికల్ కాలేజీ వస్తుందని ఊహించామా..? జనగామ నాడెట్ల ఉండే..నేడెట్ల మా రింది.. ఎడారి లాంటి ఈ గడ్డపై ఎర్రటి ఎండలోనూ రిజర్వా యర్లు, చెరువులు నిండుతాయని.. నెర్రలు బారిన నేల పచ్చటి తివాచీగా అవుతదని అనుకున్నామా? ఇది తెలంగాణ సాధించి న ఘనత.. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన కీర్తి.. సూర్యచంద్రులు ఉన్నతకాలం ఆయన రుణం తీర్చుకోగలమా?.. ఇది జనగామకు బీఆర్ఎస్ ఇచ్చిన వరం’ కాదా? అన్నారు. బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయకపోగా ఇన్ని చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజల్లో బదనాం చేసేందుకు బండి సంజయ్ దొంగ మాటలతో మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 80 శాతం ఉన్న రైతులను ఏనాడూ పట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్, ఇప్పడు కేసీఆర్ రైతుల కోసం పనిచేస్తుంటే ఓర్వలేక కండ్లు మండుతున్నాయని, ప్రతి కుటుంబానికి ఏదో ఒక లబ్ధి కల్పించిన ఏకైక ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా? మా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను దమ్ముంటే బీజేపీ పాలిత రా ష్ర్టాల్లో అమలు చేయగలరా? అని ముత్తిరెడ్డి సవాల్ విసిరారు.
మన పథకాలతో గడపగడప తట్టాలి..
– జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి
సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్దేశించిన మేరకు అన్నిస్థాయిల ప్రజాప్రతినిధులు గ్రామగ్రామానికి వెళ్లి గడపగడప తట్టి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రచారం చేయాలని ఎమ్మెల్సీ కోటిరెడ్డి పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు మండ ల, గ్రామీణ స్థాయిలో కరపత్రాల ద్వారా పథకాలను ఇంటింటి కీ చేరవేయాలన్నారు. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేరని, అలాంటి వారే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కమిటీల్లో ఖాళీలను పూర్తిచేసి మండల, గ్రామ, మహిళా కమిటీలను వేసుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా ఉంటూ ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించి మూడోసారి అధికారాన్ని చేపట్టబోతున్నదని, ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదు..జనగామ జిల్లాలో పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్, జనగామ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మళ్లీ గులాబీజెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమం లో దేశానికే దిక్సూచిగా నిలుస్తున్న తెలంగాణ పథకాలను దేశమంతా అమలు చేయాలన్న డిమాండ్ పెరుగుతుండడంతో కేంద్రం కేసీఆర్ సర్కార్ను నిలువరించే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. కేంద్రం పన్నుతున్న కుట్రను ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేయాలని అన్నారు. తనకు గిట్టని అనేక రాష్ట్రాలను పడగొట్టిన బీజేపీ దానివల్ల దేశానికి ఏం మేలు జరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోని అన్ని రాష్ర్టాల్లో బలంగా విస్తరిస్తున్న బీఆర్ఎస్ రానున్న రోజు ల్లో రాజకీయాల్లో కేంద్ర బిందువు కాబోతున్నదని అన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం, ఎంపీ పీ మేకల కళింగ రాజు, జడ్పీటీసీ నిమ్మతి దీపిక, పీఏసీ ఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు బొల్లం శారద, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల, గ్రా మ పార్టీ అధ్య క్షులు, మహిళా, యువజన, టీఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు.
ముత్తిరెడ్డితోనే కాల్వలకు నీళ్లు
– మేకల కళింగరాజు, ఎంపీపీ, జనగామ
జనగామ రూరల్: గతంలో నీరులేక ప్రజలు అల్లాడిన రోజులు ఉన్న ఈ ప్రాం తంలో నేడు పచ్చని పంటలతో కళకళలా డుతున్నాయి. ఇది ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, కేసీఆర్ పుణ్యమే. నీరులేని ఈ ప్రాం తం లో గోదావరి జలాలు పారుతున్నాయి. దీంతో రైతుల కండ్లలో సంతోషం కనబడుతోంది. ప్రతి ఇంటి కి ప్రభుత్వ పథకాలు చేరాయి. ముత్తిరెడ్డిని మరోసారి గెలిపిం చుకొని ఇక్కడి ప్రజలు మంత్రిగా చూడాలనుకుంటున్నారు.
అభివృద్ధి పరుగులు పెడుతోంది
– నిమ్మతి దీపిక, జడ్పీటీసీ, జనగామ
జనగామ అభివృద్ధి పథంలో దూసు కుపోతోంది. జిల్లా అన్ని రంగాల్లో అభి వృద్ధి సాధించింది. ఇక్కడి ప్రజలకు వైద్యం, మెడికల్ కళశాల అందుబాటులో వచ్చాయి. ప్రతి గ్రామంలో అర్హులైన వారికి పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తో పాటు అనేక సంక్షేమ పథకాలు అందు తున్నాయి. ఇవన్నీ బీఆర్తోనే సాధ్యం. ప్రతి ఒక్కరూ బీఆర్ ఎస్కు అండగా ఉండాలి.
సర్పంచ్గా అవకాశం వచ్చింది
– బొల్లం శారద, మండల సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు జనగామ
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎమ్మెల్యేగా కావడంతో దళిత బిడ్డ అయిన నాకు స ర్పంచ్ అవకాశం వచ్చింది. ఆయనకు రుణపడి ఉంటా. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తున్నా. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు ఎక్కడ అమలు కావడం లేదు. బీఆర్ఎస్తోనే ప్రజలు ఉంటా రు. ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి మళ్లీ రావాలి.