పెద్దవంగర, మార్చి 24: డాక్టర్ సాబ్ సేవలు మరువలేనివని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మండలంలోని వడ్డెకొత్తపల్లి గ్రామంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్రావు చిత్రపటం వద్ద మౌనం పాటించి నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, జాటోత్ రామచంద్రూ నాయక్, యశస్వినీరెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీరెడ్డి, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.