ఐదేళ్లలో భూపాలపల్లి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను చూడండి. ఒకప్పుడు ఎలా ఉండేది. ఇప్పుడెలా మారింది. తెలంగాణ రాష్ట్రఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో జిల్లా ప్రగతి పథంలో పయనిస్తోంది. క్యాడర్, లీడర్ లేనోళ్ల మాటలు నమ్మి ఆగం కావొద్దు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరాయి. ఆ పథకాలే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు గెలుపు బాటలు.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో భూపాలపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశా. జీఎంఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నిరుద్యోగులకు అండగా నిలిచా. మరోసారి ఆదరిస్తే జిల్లాలో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తా’ అని భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆయన నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
-భూపాలపల్లిటౌన్, ఆగస్టు 30
భూపాలపల్లిటౌన్, ఆగస్టు 30 : భూపాలపల్లి నియోజకవర్గం ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయి. ఒకప్పుడు అడవి రాజ్యంగా ఉన్న ఈ ప్రాంతం నేడు మహానగరాల సరసన చేరేలా అభివృద్ధి చెందింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత పల్లె, పట్నం అనే తేడా లేకుండాఎంతో అభివృద్ధి చెందాయని బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ‘నమస్తే తెలంగాణ’తో ఆయన మాట్లాడారు. పట్టణంలో రూ.150కోట్లతో రోడ్లు, రూ.100కోట్లతో తాగునీటి సమస్యను పరిష్కరించానని చెప్పారు. తన తండ్రి పేరున జీఎంఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు పలు పోటీ పరీక్షల కోసం ఉచితంగా శిక్షణ ఇప్పించి, వసతి కల్పించగా ఎంతో మంది ఉద్యోగాలు పొందారని తెలిపారు.ప్రజలకు అంతా తెలుసని, ఎవరిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందో వారికి స్పష్టత ఉందన్నారు. పేదల పక్షపాతి సీఎం కేసీఆర్ను మరోసారి దీవించేందుకు వారు ఎదురు చూస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాను. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాయి. భూపాలపల్లి పట్టణంలో సుమారు రూ.150కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేయించా. రూ.100కోట్లతో తాగునీటి సమస్య పరిష్కరించి ప్రతి ఇంటికి తాగునీటిని అందించాం. భూపాలపల్లిలో సింగరేణి కార్మికులకు వెయ్యి క్వార్టర్లు, పేదలకు వెయ్యి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించాం. బైపాస్ రోడ్డు మంజూరు చేయించాను. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయగా త్వరలో తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ దవాఖానలో సేవలు విస్తరించడం, పల్లె, పట్టణ దవాఖానలు అందుబాటులోకి తెచ్చాను. చెక్డ్యాంలు, సబ్స్టేషన్లు ఏర్పాటు చేశా.
ఎమ్మెల్యే : ప్రత్యేకంగా ప్రచారం అంటూ ఏమీ లేదు. రోజూ ప్రజల మధ్యనే ఉంటున్న. ఏదో సందర్భంలో సంక్షేమ పథకాలు అందిస్తున్న. సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి వంటి పథకాల్లో లబ్ధిదారులను చెక్కులు అందించేందుకు వారిని కలుస్తూనే ఉన్న. కార్యకర్తలకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అందుబాటులో ఉంటున్న. రోజూ క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉండి అందరిని కలుస్తున్న.
ఎమ్మెల్యే : ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. సమీపంలో కూడా వారికి రాజకీయ భవిష్యత్తు లేదు. హిట్లర్ మాదిరిగా గోబెల్ ప్రచారాలకు పాల్పడుతున్నారు. నాడు హిట్లర్కు పట్టిన గతే వారికి పడుతుంది. కాంగ్రెస్, బీజేపీ దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. డబుల్ ఇంజిన్ సర్కారు అని చెప్పుకోవడానికి బీజేపీకి ఏమీ లేదు. వారు పాలించే రాష్ర్టాల్లో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా లేదు. కరెంటు కోతలు, నిత్యం ఆందోళనలతో ఉన్నాయి. ఒక పార్టీకైతే క్యాడరే లేదు.. మరో పార్టీకి లీడర్ లేడు.. అలాంటి వాళ్లను ప్రజలు నమ్మ రు. ఒకే జెండాతో అభివృద్ధి చేసి చూపించాం. విద్యుత్ వినియో గం, సగటు ఆదాయం, పంటల సాగు, ధాన్యం ఉత్పత్తి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రథ మ స్థానంలో నిలిచింది. ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలు, సీఎం.. శాసనసభ్యులను విమర్శించే తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వారికి సరైన సమయంలో వాళ్లే బుద్ధి చెబుతారు.
ఎమ్మెల్యే : నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం. ఎక్కడ ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుండడం. వరదలు వస్తే ప్రజలకు దగ్గరుండి సహాయ సహకారాలు అందించాను. మూడేళ్ల క్రితం వచ్చిన వరదల్లో చిక్కుకున్న రైతులను తక్షణమే హెలికాప్టర్లు తెప్పించి సురక్షిత ప్రాంతాలకు తరలించా. ఎక్కడ ఏ సమస్య ఉన్నా నాతోపాటు నా సతీమణి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నాం.
ఎమ్మెల్యే : మా తండ్రి గండ్ర మోహన్రెడ్డి పేరున గండ్ర మెమోరియల్ ట్రస్టు (జీఎంఆర్)ను ఏర్పాటు చేసి అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాం. విద్యార్థులకు గ్రూప్-1, పోలీసు, ఎస్సై పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇప్పించడంతో పాటు వసతి, భోజన ఏర్పాట్లు చేశాం. నియోజకవర్గంలో అర్హులైన వారికి లైట్, హెవీ డ్రైవింగ్ శిక్షణ ఇప్పించి ఉచితంగా లైసెన్సులు అందించాం. దీంతో వారు స్వయం ఉపాధి పొందుతున్నా రు. జిల్లా దవాఖానలోప్రతి రోజు రోగుల అటెండెంట్లకు ఉచితంగా అన్నదానం నిర్వహిస్తున్నం. నియోజకవర్గంలో వేలాది మంది ట్రస్టు ద్వారా
ఎమ్మెల్యే : కరోనాతో ప్రజలకు కొన్ని పనులు చేయలేకపోయా. భూపాలపల్లిని ఆదర్శ జిల్లాగా ఏర్పాటు చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశాం. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తీసుకొస్తాను. టూరిజం పరంగా జిల్లాలో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తా. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి, పాండవుల గుట్ట, గణపురం చెరువు, కోటగుళ్లను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుత. ఇంకా పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న పనులన్నీ నెరవేరుస్తా.
ఎమ్మెల్యే : ప్రజలను నేను ఒక్కటే కోరుతున్న. పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టండి. మాటలతో, అస్యతపు ఆరోపణలతో కాలం వెళ్లదీసే వ్యక్తులకు బుద్ధి చెప్పండి. తొమ్మిదేళ్లలో తెలంగాణలో ఎంతో అభివృద్ధి జరిగింది. భూపాలపల్లి నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయి. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. పార్టీ చేస్తున్న పనులు చూసి ఆదరించండి. గోబెల్ ప్రచారాలు నమ్మి వారికి ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుంది.