ఉద్యమకారులు, అమరుల త్యాగఫలితంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్ భవేశ్ మిశ్రా హాజరై అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 14 ఏండ్ల పాటు సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. ఈ క్రమంలో అసువులుబాసిన వారి జ్ఞాపకార్థం హైదరాబాద్లో అమరుల స్మారక చిహ్నం నిర్మించి వారి త్యాగాలు శాశ్వతంగా గుర్తుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేసిన అధికారులు, ప్రజా ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు.
కృష్ణకాలనీ, జూన్ 22 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అమరుల తాగఫలం, అనేకమంది ఉద్యమకారుల పోరాటాలతోనే సిద్దించిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్ భవేశ్మిశ్రా హాజరై అంబేద్కర్ సెంటర్లోని అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 14 సంవత్సరాల పాటు సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన రాష్ట్ర సాధన ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారన్నా రు. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ వం టి మహనీయుల సూచనలతో కేసీఆర్ తెలంగాణ ఉద్యమ వేడిని ఢిల్లీకి తాకేలా పోరాడారన్నారు.
అమరుల త్యాగాలను నితరంతరం స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కు ఐకమత్యంతో కృషి చేయాలన్నారు. హైదరాబాద్లో అమరుల స్మారక చిహ్నం నిర్మించి వారి త్యాగాలు శాశ్వతంగా నిలిచిపోయేలా సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్ర భుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. జిల్లాలో ని అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో 22 రోజులుగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించామన్నారు. వివిధ శాఖల ద్వారా జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించినట్లు తెలిపారు. సభలు, సమావేశాల్లో పా టల రూపంలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను వివరించిన తెలంగాణ సాంస్కృత్కి కళాకారులకు ప్రత్యేక బహుమానంగా ఒక్కొక్కరికి రూ.5 వేలు అందజేస్తున్నామన్నారు. ఉత్సవాల విజయవంతానికి సహకరించిన అధికారులు, ప్రజా ప్రతినిధులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్ భవేశ్మిశ్రా మాట్లాడుతూ అమరవీరుల ఆశయ సాధనకు మనంతా కృషి చేయాలన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతిని వివరిస్తూ 22 రోజులుగా జిల్లాలోని ప్రతి గ్రామం, మున్సిపాలిటీలో వివిధ శాఖల ద్వారా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించామన్నారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, జడ్పీ వైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభా రఘుపతిరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేశ్, బీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీశ్రెడ్డి, టీబీజీకేఎస్ బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమయ్మ, పార్టీ నాయకులు బీబీచారి, కరీం, శ్రీనివాస్, పానుగంటి శ్రీనివాస్, పిల్లలమర్రి నారాయణ, కరాటే శ్రీనివాస్, యూత్ నాయకులు బుర్ర రాజు, శ్రీకాంత్ పటేల్, రాకేశ్ పాల్గొన్నారు.