పరకాల/గీసుగొండ, నవంబర్ 13 : బీఆర్ఎస్తోనే అభివృద్ధి జరిగిందని, గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో పరకాల రూపురేఖలు మారాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన టీడీపీ శ్రేణు లు, పరకాల యువత బీఆర్ఎస్లో చేరారు. వీరి కి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. నియోజకవర్గంలో విపక్షాలకు స్థా నం లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పరకాల నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందన్నారు. కానీ ప్రత్యేక తెలంగాణలో సీఎం కేసీఆర్ చొరవతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకున్నట్లు తెలిపారు. ఇటీవల టీడీపీకి చెందిన నేత పార్టీ శ్రేణులను పట్టించుకోకుండా ప్యాకేజీకి అమ్ముడుపోయాడని విమర్శించారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను ప్రజలు నమ్మొద్దని కోరారు. 24 గంటల కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా? 3 గంటల కరెంటు చాలంటున్న కాంగ్రెస్ పార్టీ కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు.
పార్టీలో చేరిన వారిలో ఆత్మకూరు మండలానికి చెందిన టీడీపీ నాయకులు కందుకూరి నరేశ్, కొంగర ప్ర భాకర్, గోనె మధూకర్, సిద్దోజు రాజమౌళి, పైం డ్ల రమణ, దామెరకు చెందిన నల్ల రవి, పరకాల కు చెందిన ఆంజనేయులు, సుంకరి దిలీప్, చిదురాల రామన్న, కృష్ణపాల్, పెంచాల రాజు, మెహరజ్ బేగం, గీసుకొండకు చెందిన తాటి సాంబశివారావు, కేదాసి స్వామి, సంపత్రెడ్డి, నీలం పరశురాములు, ఆంగోత్ అశోక్, ఆంగోత్ రాజు, ఆంగోత్ నవీన్, ఆంగోత్ రవి, ఆంగోత్ రాజశేఖ ర్, జీవన్, అక్షయ్కుమార్, వంశీ, యాకూబ్, రాజు, మహేందర్, రాజేందర్, ప్రశాంత్, మనో జ్, కుమార్, సతీశ్, కుమార్, రాజు, హరి, పరకాలకు చెందిన యువత ఎండీ అఫ్రోజ్, అనిల్, అశోక్, ఎస్ అఖిల్, శివకుమార్, ఎండీ ఉమర్, టీ దేవేందర్, గడ్డం విష్ణు ఉన్నారు. కార్యక్రమం లో సర్పంచ్ ఆంగోత్ కవిత-మహబూబ్ నాయ క్, ఉప సర్పంచ్ నర్సింహ, యూత్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జూలూరి లెనిన్గౌడ్, నాయకులు వీరన్న, ప్ర మోద్, హరి, భూక్యా రాజు, భద్రు పాల్గొన్నారు.