వరంగల్ : ప్రపంచంలో ప్రకృతిని ఆరాధించే సంస్కృతి ఒక్క తెలంగాణకే ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలోఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే అతిథి బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆడపడుచులు అందరూ ఎలాంటి తారతమ్యాలు లేకుండా కలిసి మెలసి ఆడుకునే పండుగ బతుకమ్మ అన్నారు. ఒకప్పుడు తెలంగాణకే పరిమితమైన బతుకమ్మ పండుగ.. నేడు విశ్వవ్యాప్తం కావడం గర్వంగా ఉందని వెల్లడించారు.
తెలంగాణ పండుగల విశిష్టతను భావితరాలకు అందిస్తూ మన సంస్కృతి, సంప్ర దాయాలను కాపాడుకోవాలని పేర్కొన్నారు. ప్రజలందరూ సంతోషకర వాతావరణంలో బతుకమ్మ, దసరా పండుగలను జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.