నయీంనగర్, మే 13 : పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. కోమటిపల్లి మధుతండాకు చెందిన లావుడ్యా లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం ఎమ్మెల్యే దృష్టికి రావడంతో సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.90వేల ఎల్వోసీని మంజూరు చేయించారు
. ఈ మేరకు హనుమకొండ ప్రశాంత్నగర్లోని ఆయన నివాసంలో బాధితులకు శనివారం ఎల్వోసీ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు.