వరంగల్ : టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా వర్ధన్నపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీలకు, స్థానిక మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నియమించిన గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, అనుబంధ కమిటీల సభ్యులు, మండల ప్రజా ప్రతినిధులు, మండల నాయకులతో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
మండల కమిటీ ఏర్పాటుపై పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ గ్రామ, అనుబంధ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే అరూరి రమేష్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామ, అనుబంధ కమిటీల సభ్యులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.