హసన్పర్తి, ఏప్రిల్ 29: ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారి సొంతింటి కల నెరవేరనుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ ఒకటో డివిజన్ పలివేల్పుల, రెండో డివిజన్లోని భగత్సింగ్ కాలనీలో శనివారం ఎమ్మెల్యే అరూరి రమేశ్ రెవెన్యూ అధికారులతో పర్యటించారు. మహిళలు బతుకమ్మలు, కోలాటాలు, డప్పు చప్పుళ్లు, పూలతో ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. అనంతరం బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీవో 58, 59 ద్వారా అర్హులైన పదేలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పేదలకు అండగా సీఎం కేసీఆర్, ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. గుడిసె వాసుల కళ్లల్లో ఆనందం చూడడం కోసం సీఎం కేసీఆర్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.
కాలనీలో వసతులు కల్పించినట్లు తెలిపారు. అనంతరం భగత్సింగ్ కాలనీలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్కు రూ.5 లక్షలు మంజూరు చేశారు. ఇంకా మరిన్ని నిధులు వెచ్చించి కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రైవేట్ దవాఖానలకు దీటుగా సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించేందుకు రూ.1200 కోట్లతో వరంగల్లో సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మిస్తున్నట్లు వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కొల ్లగొట్టేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఒకటో డివిజన్ అధ్యక్షుడు నరెడ్ల శ్రీధర్, మాజీ కార్పొరేటర్ కల్పన, భగత్సింగ్ కాలనీ అధ్యక్షుడు మంద మల్లేశం, దుబ్బ శ్రీను, తహసీల్దార్ రాజ్కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్, మార్కెట్ డైరెక్టర్ గనిపాక విజయ్, జాగృతి జిల్లా అధ్యక్షుడు సుమన్, చల్లా వెంకటేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు లోకేశ్యాదవ్, నాయకులు ఖాదర్, రమేశ్యాదవ్ పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం
కాశీబుగ్గ: పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అన్నారు. శనివారం 14వ డివిజన్లోని కారల్మార్క్స్ కాలనీ, చాకలి ఐలమ్మనగర్, సుందరయ్యనగర్ను సందర్శించి 58,59 జీవోలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో గుడిసెలు అర్హులకు పట్టాలు ఇస్తామని తెలిపారు. పేద ప్రజలకు అండగా నిలిచే ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. ఇప్పటి వరకు ఆయా కాలనీల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. స్థానిక సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి పరిష్కరించినట్లు తెలిపారు. అర్హులు పట్టాల కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డివిజన్లో అన్ని వసతులు కల్పించినట్లు వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ తూర్పాటి సులోచన, మాజీ జడ్పీటీసీ తూర్పాటి సారయ్య, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ముడు సు నరసింహా, ప్రధాన కార్యదర్శులు పత్రి సుభాష్, గండ్రా తి భాస్కర్, సీనియర్ నాయకులు దుబ్బ శ్రీనివాస్, గంధం గోవింద్, కేతిరి రాజశేఖర్, పస్తం యాదగిరి, డోజర్ ఎల్లయ్య, ఈర్ల రాజేందర్, కొంగరి సుదర్శన్, కొత్తపల్లి అనిల్, ఎస్ సంతోష్, ఆర్ విజయ, మాధవి పాల్గొన్నారు.
గుడిసె వాసులను గుండెల్లో పెట్టుకుంటాం..
మడికొండ: గుడిసె వాసులను గుండెల్లో పెట్టుకుంటామని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 46వ డివిజన్ పరిధిలోని మడికొండలోని ఎంఎన్ఆర్ కాలనీలో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థలాల క్రమబద్ధీకరణ కోసం ఆదివారం లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆక్రమణదారులు 2014 జూన్ 2లోపు సంబంధిత స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉండాలనే నిబంధనను ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సవరించిందని, 2020 జూన్ రెండో తేదీలోపు వారి అధీనంలో ఉన్నట్లు ఆధారాలు చూపాల్సి ఉంటుందని చెప్పారు. మీ సేవ కేంద్రాల్లో జీవో 58, 59 పోర్టల్ను తిరిగి తెరిచిందన్నారు. నియోజకవర్గంలోని 13 డివిజన్లలో రూ.3,500 కోట్లతో అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. గుడిసె వాసుల విషయంలో కొంత మంది రాజకీయం చేయాలని చూస్తున్నారని, ఎండోమెంట్ నుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత నాదే అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మునిగాల సరోజన, తహసీల్దార్ కిరణ్కుమార్, ఆర్ఐ సురేందర్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు బొల్లికొండ వినోద్కుమార్, మెట్టుగుట్ట చైర్మన్ దువ్వ నవీన్, బీఆర్ఎస్ నాయకులు దువ్వ శ్రీకాంత్, వల్లెపు ఉపేందర్, బరిగెల కృష్ణమూర్తి, కొలిపాక కుమార్ బాబు, పైడిపాల రవీందర్, పల్లపు కుమార్రాజ్, తూర్పాటి అబ్బాయిలు, బుర్ర రాజన్ బాబు, పల్లపు రాజ్కుమార్ పాల్గొన్నారు.