నర్సంపేట/ నర్సంపేట రూరల్/నెక్కొండ, నవంబర్ 22 : నియోజకవర్గంలో మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మంగళవారం పరామర్శించారు. కొత్తగూడెం మండల ఏపీఎంగా విధులు నిర్వర్తిస్తున్న పలకల రఘోత్తంరెడ్డి అనారోగ్యంతో మృతిచెందగా నర్సంపేట మార్చురీ వద్ద భౌతిక కాయాన్ని ఎమ్మెల్యే పెద్ది సందర్శించారు. మృతదేహం వద్ద నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి ఎంపీటీసీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది శ్రీనివాస్రెడ్డి తండ్రి పెద్ది సాంబరెడ్డి(75) సోమవారం బిల్డింగ్ ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. తీవ్ర గాయాలు కాగా హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఎంపీటీసీ మృతదేహంపై పూలమాల ఉంచి నివాళులు అర్పించారు. కుటుంబాన్ని పరామర్శించారు. నర్సంపేట, ఖానాపురం ఎంపీపీలు మోతె కళావతి, ప్రకాశ్రావు, జడ్పీటీసీ కోమాండ్ల జయ, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, గుంటి కిషన్, నల్లా భారతి, ఉపాధ్యక్షులు అల్లి రవికుమార్, మచ్చిక రాజుగౌడ్, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్రెడ్డి, సర్పంచ్ బరిగెల లావణ్య, టీఆర్ఎస్ నాయకులు కట్ల సుదర్శన్రెడ్డి, కర్ణాకర్, వీరన్న, కిశోర్, రాజు, రమేశ్, తిరుపతి ఉన్నారు.
ఎంపీడీవో అంబటి సునిల్కుమార్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు సంతోశ్బాబు, కొండల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి కూడా పరామర్శించారు. నెక్కొండ మండలం సూరిపల్లి మాజీ ఎంపీటీసీ ధారావత్ మాజమ్మ భర్త బీల్నాయక్ అనారోగ్యంతో మృతిచెందగా మంగళవారం మృతదేహం వద్ద ఎమ్మెల్యే పెద్ది నివాళులర్పించి బాధిత కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మండల నాయకులు గాదె భద్రయ్యఉన్నారు.