పోడు రైతుల్లో అర్హులందరికీ పట్టాలు అందిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. పోడు రైతుల సమస్యల పరిష్కారం, అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి హనుమకొండ కలెక్టరేట్లో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ పోడు సమస్యకు పరిష్కారం చూపేందుకు సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అటవీ హకుల చట్టం- 2005 పరిధికి లోబడి పోడు రైతులకు న్యాయం జరిగేలా సలహాలు, సూచనలను పరిగనలోకి తీసుకుంటామని, ఇకముందు అడవుల నరికివేతకు పాల్పడే వారిపై కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు.
– హనుమకొండ, సెప్టెంబర్ 22
హనుమకొండ, సెప్టెంబర్ 22 : దీర్ఘకాలంగా నానుతున్న పోడు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. పోడు సమస్యలు, అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సత్యవతితో కలిసి హనుమకొండ కలెక్టరేట్లో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు హాజరైన ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు తమ సలహాలు, సూచనలు ఇచ్చారు. కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు, ఐటీడీఏ అధికారులు, తహసీల్దార్ల నుంచి మంత్రులు వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ అటవీ హకుల చట్టం-2005 ప్రకారం పోడు చేసుకుంటున్న రైతులకు శాశ్వత పరిషారం చూపే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకుపోతున్నదని చెప్పారు.
ఓవైపు పోడు రైతులకు న్యాయం చేస్తూనే అడవుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సబ్ కమిటీ వేసిందని తెలిపారు. ప్రతి ఒకరూ అడవుల సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలన్నారు. అడవుల పునరుద్ధరణలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందువరుసలో ఉందని తెలిపారు. రాజకీయాలకు తావులేకుండా అర్హులైన గిరిజనులు, గిరిజనేతరులకు అటవీ హకులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోడు చేసుకుంటున్న రైతులు స్థానిక నిరుపేదలను గుర్తించాలని, కావాలనే పోడు చేసుకుంటే మాత్రం చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామస్తుల నిర్ణయం మేరకే పోడు రైతుల్లో అర్హులను గుర్తిస్తామన్నారు. ఇందుకోసం గ్రామసభలు నిర్వహించాలని, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను భాగస్వాములను చేయాలన్నారు. అటవీ, రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. 15రోజుల్లో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి సమీక్షిస్తామని చెప్పారు.
పోడు రైతులకు న్యాయం చేస్తాం : మంత్రి సత్యవతి
పోడుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. పోడు భూముల సమస్య పరిషారానికి జీవో 140ని జారీ చేసిందని, ఇందుకనుగుణంగా అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలన్నారు. అటవీ, రెవెన్యూ అధికారులు క్షేత్ర పర్యటనకు వెళ్లినప్పుడు ఎఫ్ఆర్సీ కమిటీకి సమాచారం అందించడంతో పాటు రిజిస్టర్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, బీట్ అధికారి క్షేత్ర పర్యటనకు వెళ్లినప్పుడు సంబంధిత కోఆర్డినేటర్ ద్వారా జీపీఎస్ నమోదు చేయాలని, సర్వే బృందం రోజూ దరఖాస్తులను పరిశీలించాలని చెప్పారు. ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పంచాయతీల వారీగా దరఖాస్తులను పరిశీలించేందుకు కార్యాచరణ రూపొందించి తేదీలను నిర్ణయించి సర్వే ప్రారంభించాలని, సర్వే తేదీలను ముందుగానే దరఖాస్తుదారులకు తెలియజేయాలని చెప్పారు. పోడు రైతులు నష్టపోకుండా చూడడంతో పాటు మున్ముందు ఎవరూ అడవుల జోలికి వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో అటవీ సంపదను పెంచాలనే సంకల్పంతో హారితహారం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామని తెలిపారు. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో 23 శాతం ఉన్న అటవీ సాంద్రత 28శాతానికి పెరిగిందని మంత్రి వివరించారు.
ఆ దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోవాలి : ఎమ్మెల్యే పెద్ది
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలోని 66 పంచాయతీల్లో 7,470 మంది పోడు వ్యవసాయం చేసుకుంటున్నారని, వీరిలో కొందరు మహబూబాబాద్, నర్సంపేట సరిహద్దుల్లో ఉండడంతో దరఖాస్తులు మహబూబాబాద్ జిల్లాలో పెట్టుకున్నారని, ఇలాంటి వారి దరఖాస్తులను సైతం పరిగణలోకి తీసుకోవాలని కోరారు. నిజమైన పోడు రైతులకు పట్టాలు లేక ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నారని చెప్పారు. హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు మాట్లాడుతూ పోడు రైతులకు అటవీ హకుల కల్పన కోసం ప్రభు త్వం జారీ చేసిన మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తామన్నారు. పోడుపై రెండు వారాల్లో యాక్షన్ ప్లాన్ అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమం లో వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, వరంగల్ కలెక్టర్ డాక్టర్ బీ గోపి, మేయర్ గుండు సుధారాణి, ఏటూరునాగారం ఐటీడీఏ పీవో అంకిత్, అటవీ, రెవె న్యూ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.