హనుమకొండ, ఏప్రిల్ 8 : ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురసరించుకొని తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రామప్పలో ఈ నెల 18న వారసత్వ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు. ఉత్సవాల వాల్ పోస్టర్ను శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, శంకర్నాయక్, నగర మేయర్ గుండు సుధారాణి, ములుగు, భూపాలపల్లి కలెక్టర్లు ఇలా త్రిపాఠి, భవేశ్మిశ్రాతో కలిసి ఆవిషరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయానికి 2021 జూలై 25న ప్రపంచ వారసత్వ హోదా దకిందన్నారు.
చైనాలోని పూజౌలో నిర్వహించిన యునెసో హెరిటేజ్ కమిటీ సమావేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్లో పాల్గొన్నారని, 17 దేశాలకు చెందిన ప్రతినిధులు రామప్పకు అనుకూలంగా ఓటు వేశారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 255 కట్టడాలు యునెసో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడగా రామప్ప యునెసో జాబితాలో చోటు సంపాదించుకోవడం భారతీయులందరికీ గర్వకారణమని మంత్రులు పేర్కొన్నారు. దీంతో 800 ఏళ్ల నాటి రామప్ప దేవాలయానికి తగిన గుర్తింపు లభించిందన్నారు. ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలు, దాడులు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడిందన్నారు. దేవాలయ ప్రాంగణంలో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదిలి వేయడం వలన అందులో కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసే బాధ్యతను కొంతమేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని మంత్రులు తెలిపారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన రామప్ప ప్రస్తుతం కేంద్ర ప్రభు త్వ ఆధీనంలో ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం సైతం కొన్ని నిధులు ఇచ్చి రామప్పను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర సాయం కోసం ఎదురుచూడకుండా సీఎం కేసీఆర్ రాష్ట్రం తరఫున రూ.4.21 కోట్ల నిధులు మంజూరు చేసి, పరిరక్షణ పనులు చేపట్టారని చెప్పారు. అలాగే, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రూ.10 లక్షలు మంజూరు చేశామన్నారు. త్వరలో మరిన్ని నిధులను సమకూర్చనున్నట్లు మంత్రులు తెలిపారు. రోజువారి నిర్వహణకు రూ.82 లక్షలు, రూ.3 కోట్లతో కామేశ్వరాలయ పునరుద్ధరణ, ఈశాన్య భాగంలో ప్రాకారం పునరుద్ధరణ, లైటిం గ్, భవనాల నిర్మాణం, తూర్పు ద్వారం నుంచి ఇప్పటికే ఉన్న రాతి మార్గాన్ని పొడిగించడం వంటి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. భవిష్యత్లో మరిన్ని నిధులు వచ్చి అభివృద్ధి జరిగే అవకాశం ఉందన్నారు. వేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, ప్రముఖ డ్రమ్స్ వాయిద్యకారుడు శివమణి, సింగర్ కార్తీక్, ప్లూటిస్ట్ నవీన్తో పాటు 300 మంది కళాకారులతో సంగీత విభావరి ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. బలగం సినిమా ప్రదర్శనకు ఆలోచన చేస్తున్నామన్నారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వారసత్వ ఉత్సవాలపై విసృ్తత ప్రచారం కల్పించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.