హనుమకొండ, జనవరి 22 : తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హనుమకొండ, వరంగల్ జిల్లాల యూనిట్ల నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి కొండా సురేఖ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా గెజిటెడ్ అధికారులు ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందజేయాలని, జిల్లా అభివృద్ధి దిశలో పయనించేందుకు కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎన్నమనేని జగన్ మోహన్రావు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, కార్యదర్శి ఫణికుమార్, డాక్టర్ ప్రవీణ్కుమార్, రాష్ట్ర కార్యదర్శులు కిరణ్కుమార్గౌడ్, రాజేశ్ కుమార్, జిల్లా నాయకులు సురేశ్కుమార్, మాధవరెడ్డి, వెంకటేశ్వర్లు, ఆస్నాల శ్రీనివాస్, రాజేశ్కుమార్, సుధీర్కుమార్, రామచందర్రావు, మైదం రాజు పాల్గొన్నారు.