చిన్నగూడూరు, జనవరి 4 : బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇటీవల ఆటోను గ్రానైట్ లారీ ఢీకొన్న ప్రమాదంలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. డిసెంబర్ 31వ తేదీన మంగోరిగూడెం నుంచి ఎనిమిది ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గ్రానైట్ లారీ కురవి మండల కేంద్రం శివారులో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో ఐదుగురు గ్రామస్తులకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మంత్రి బుధవారం గ్రామా న్ని సందర్శించారు. మృతులు బానోత్ సుమన్, యాకారపు శ్రీకాంత్, డెంకన నవీన్ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న లింగంపెల్లి రాం బాబు, నూనావత్ వీరన్నను పరామర్శించారు. కుటుంబ సభ్యులు రోదిస్తుండగా ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులకు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి పంపించి మెరుగైన వైద్యం అం దించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రమాదం వివరాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. మృతుల కుటుంబాలకు పక్కా ఇళ్లు, వారి పిల్లలకు గురుకుల పాఠశాలల్లో విద్య, అర్హత ప్రకారం ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు. రైతుబీమా ఉన్న వారికి రూ.5 లక్షలు, ఆపద్బంధు పథకం కింద మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. మృ తుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేలు, క్షతగాత్రులకు రూ.5వేలు వ్యక్తిగత ఆర్థికసాయం అందించారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై కేసు నమోదు చేసి బాధితులను ఆదుకుంటామని తెలిపారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడం తనను కలచి వేసిందన్నారు. మంత్రి వెంట అదపు కలెక్టర్ డీఎస్పీ రఘు, తహసీల్దార్ రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు వల్లూరి వెంకటరెడ్డి, కొంపెల్లి శ్రీనివాసరెడ్డి, వల్లూరి కృష్ణారెడ్డి, జడ్పీటీసీ బండి వెంకటరెడ్డి, సీఐ సాగర్, సర్పంచ్ లునావత్ నవీన్, నాయకులు ఉప్పల్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, అఫ్జల్ ఉన్నారు.