గూడూరు(కొత్తగూడ), నవంబర్ 23: కొత్తగూ డ మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ మోడల్ స్కూల్ను బుధవారం మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు. ఫుడ్ పాయిజన్తో విద్యా ర్థులు అస్వస్థతకు గురికావడంతో వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. హాస్టల్లో వసతులు సక్రమంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు.
విద్యార్థులకు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని, నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, జడ్పీ చైర్పర్సన్ బిందు, జిల్లా వైద్యాధికారి హరీశ్రాజ్, తహసీ ల్దార్ నరేశ్, ఓడీసీఎంఎస్ వైస్ చైర్మన్ దేశిడి శ్రీని వాస్రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కొమ్మ నబోయిన వేణు, స్థానిక సర్పంచ్ మల్లెల రణధీర్ తదితరులు పాల్గొన్నారు.