భూపాలపల్లి రూరల్, మే 13: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శనివారం తెలిపారు. ఆదివారం ఉదయం 8.30 గంటలకు క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం గణపురం మండలం చెల్పూర్లో ఏర్పాటు చేసిన మిల్లెట్ ప్రోసెసింగ్ యూనిట్ను, భూపాలపల్లి మండలం కమలాపూర్లో హెచ్డీఎఫ్సీ సీఎస్ఆర్ ప్రాజెక్ట్ను, సుభాష్కాలనీలో నిర్మించిన సఖీ సెంటర్ బిల్డింగ్ను, ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లోఅంబులెన్స్ను ప్రారంభిస్తారని ఎమ్మెల్యే వివరించారు.
సమ్మక్క బరాజ్కు జలకళ
కన్నాయిగూడెం, మే 13: మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద గోదావరి వరద పెరిగి నిండుకుండలా మారింది. ఇదివరకు ఒక గేటును ఎత్తగా శనివారం మరో రెండు గేట్లను ఎత్తి 3గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి 10,855 క్యూసెక్కుల వరద వస్తుండటంతో 3గేట్ల ద్వారా 10,315 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. బరాజ్ వద్ద 80 మీటర్ల ఎత్తు వరకు నీటిమట్టం ఉండేలా గేట్లను ఆపరేట్ చేస్తున్నారు.
కొనసాగుతున్న దేవాదుల పంపింగ్
దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి మోటర్ల ద్వారా నిర్విరామంగా గోదావరి నీటి పంపింగ్ కొనసాగుతున్నది. ఈ ఏడాదికిగాను ఇప్పటివరకు నీటి అవసరాల మేరకు మోటర్ల ద్వారా 9 టీఎంసీల నీటిని తరలించారు. శనివారం రెండు మోటర్లతో 540 క్యూసెక్కుల నీటిని భీంఘన్పురం రిజర్వాయర్లోకి తరలించినట్లు డీఈ శరత్, ఏఈఈ సాయిరాం తెలిపారు.