హనుమకొండ, మార్చి 14 : వాహనాల రిజిస్ట్రేషన్ను శుక్రవారం నుంచి టీజీతో చేయనున్న ట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువా రం హనుమకొండ కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్ష మేరకే టీజీగా మా ర్చుతున్నామన్నారు. శుక్రవారం నుంచి టీజీ పేరుతో 0001 నంబర్ల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.
ఇప్పటి వరకు రిజర్వేషన్ నంబర్లు బుక్ చేసిన వారికి 15 రోజుల్లో న్యాయం జరిగేలా చూస్తామన్నారు. అలాగే, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు, తెలంగాణ గీతం విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ జారీని కఠినతరం చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీలో 3వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు.