రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు కమలాపూర్ వస్తున్నారు. మండల కేంద్రంలో రూ.43.5కోట్లతో నిర్మించిన మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల, బాలుర విద్యాలయాలు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ప్రారంభిస్తారు. ఎంజేపీ విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేస్తారు. అంతకుముందు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనుండగా ఈ మేరకు అధికారులు, పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. అమాత్యుడు కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను సోమవారం సాయంత్రం మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సీపీ రంగనాథ్ పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కమలాపూర్, జనవరి 30 : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాకకోసం కమలాపూర్ ముస్తాబైంది. ఉదయం 11:30గంటలకు హెలికాప్టర్లో గూడూరు శివారులోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ఏర్పా టు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి కాన్వాయ్లో ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుంటారు. ఇక్కడే ఆర్టీసీ బ స్టాండ్, పెద్దమ్మ దేవాలయం, ముదిరాజ్ కమ్యూనిటీహాల్, గౌడ కమ్యూనిటీహాల్, అయ్యప్పస్వా మి ఆలయం, మార్కండేయ దేవాలయం, పద్మశాలీ కమ్యూనిటీహాల్, ఎస్సీ కమ్యూనిటీహాల్, డ బుల్ బెడ్ రూం ఇండ్లకు శంకుస్థాపన చేస్తారు. 12 గంటలకు సామూహిక కమ్యూనిటీ భవనాల వద్ద కు చేరుకొని ప్రారంభిస్తారు. 12:30 గంటలకు ఎంజేపీ బాలికల విద్యాలయానికి చేరుకుని ఎంజే పీ బాలికల, బాలుర విద్యాలయాలు, కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం, ప్రభుత్వ జూనియ ర్ కళాశాలలను ప్రారంభిస్తారు. 1 గంటకు ఎం జేపీ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చే స్తారు. 2గంటలకు కమలాపూర్ నుంచి కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు రోడ్డు మార్గంలో వెళ్లి అ క్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.
కమలాపూర్ గులాబీమయం..
మంత్రి కేటీఆర్ రాక కోసం కమలాపూర్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. పట్టణంలో రహదారులకు ఇరువైపులా గులాబీ జెండాలు, భారీ ప్లెక్సీలు కట్టడంతో కమలాపూర్ గులాబీ మయమైంది. కేటీఆర్కు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు అన్ని వర్గాల ప్రజలు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి గంగుల
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన కోసం కమలాపూర్లో ఏర్పాట్లను రాష్ట్రంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మె ల్సీ కౌశిక్రెడ్డి సోమవారం పరిశీలించా రు. అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ ఏండ్ల తరబడి వెనుకబడిన బీసీ విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందించేందుకే సీఎం కేసీఆర్ గురుకులాలు నిర్మించినట్లు చెప్పా రు.
తెలంగాణ ప్రభుత్వం రూ.20కోట్లతో కమలాపూర్లో అద్భుతమైన ఎంజేపీ బాలికల గురుకులాన్ని నిర్మించిందని చెప్పారు. బీసీ మంత్రిగా ఎంజేపీ గురుకులాల ప్రారంభోత్సవంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంట ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్యాదవ్, మాజీ ఎమెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, సింగిల్ విండో చైర్మన్ సంపత్రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణరావు, సర్పంచ్ సాంబయ్య, ఆర్డీవో వాసుచంద్ర, పలు శాఖల అధికారులు ఉన్నారు.
పోలీసుల భారీ బందోబస్తు
మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం గూడూరులో హెలీప్యాడ్, తహసీల్దార్ కార్యాల యం, సామూహిక కమ్యూనిటీ భవనాలు, ఎంజే పీ బాలికల విద్యాలయంలో ఏర్పాట్లను పరిశీలించి పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. 300 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నట్లు సీఐ సంజీవ్ తెలిపారు. ఇక్కడ వరంగల్ సెంట్రలో జోన్ డీసీపీ ఎంఏ బారీ, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు ఉన్నారు.
అధునాతన హంగులతో గురుకులాల భవనాలు
మండలంలోని గూడూరు పంచాయతీ పరిధిలోని కమలాపూర్-హనుమకొండ రహదారికి ఇరువైపులా రూ.43.5 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషనల్ హబ్ను ఏర్పాటు చేసింది. ఒకే చోట రూ.20కోట్లలో మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల విద్యాలయం, రూ.19కోట్లతో మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలుర గురుకుల విద్యాలయం, రూ.2.5కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాల, రూ.2.5కోట్లతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనాలను అత్యాధునిక వసతులతో నిర్మించింది. ఎంజేపీ బాలికలు, బాలుర గురుకుల విద్యాలయాలు ఒక్కోదానిలో 800మంది విద్యార్థులు చదువుకునేలా ఏర్పాట్లు చేసింది. జీ ప్లస్ వన్ స్కూల్ బిల్డింగ్, జీ ప్లస్ 2 హాస్టల్ భవనం , డైనింగ్ హాల్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు నివాసం ఉండేలా వేర్వేరు భవన సముదాయాలను కట్టించింది. జీ ప్లస్ 2 విధానంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, జీ ప్లస్2 విధానంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని అందుబాటులోకి తెచ్చింది.