జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): బీజేపీ హఠావో.. సింగరేణి బచావో.. ప్రస్తుతం కార్మికుల నినా దం ఇదే. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలపై కొంత కాలంగా కార్మిక సం ఘాలు, కార్మికులు గుర్రుగా ఉన్నారు. వీరికి బీఆర్ఎస్తో పాటు టీబీజీకేఎస్ నాయకులు అండగా నిలుస్తున్నారు. దేశంలోని ప్ర భుత్వ రంగ సంస్థలను తెగనమ్మడమే పనిగా పెట్టుకున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సింగరేణి పై కుట్రలకు తెర తీసింది. ఇందులో భాగంగా కల్యాణి ఖని బ్లాక్, శ్రావణపల్లి, సత్తుపల్లి బ్లాక్-3, కోయగూడెం బ్లాక్-3, లను వేలం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించబోతున్నది.
కేంద్ర ప్రభుత్వం కుట్రలకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూ వస్తున్నది. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ రాష్ట్ర వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే నాలుగు బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని కోరుతూ వేర్వేరుగా లేఖలు రాశా రు. టీబీజీకేఎస్తో సహా అన్ని కార్మిక సంఘాలు కేంద్రం చర్యల కు నిరసనగా 2021 డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో 72 గంటల మెరుపు సమ్మె చేశారు. టీబీజీకేఎస్ కూడా గతేడాది పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. కేటీఆర్ పిలుపు మేరకు గతేడాది ఫిబ్రవరి 9న ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టగా, కోల్బెల్ట్ ప్రాంత బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మ న్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, టీబీజీకేఎస్ అగ్ర నేత లు, నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేశారు. బీజేపీ హఠావో.. సింగరేణి బచావో అంటూ భూపాలపల్లి ఎ మ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో సింగరేణిలో పో రు దీక్ష నిర్వహించారు. ఎన్ని ఆందోళనలు చేపట్టినా, కేంద్రం తీరులో మార్పు రాకపోవడంపై కార్మిక లోకం గుర్రుగా ఉంది.
గతనెల 22న భూపాలపల్లిలో పర్యటించిన ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్ అధ్యక్షురాలు కవిత కేంద్రం కుట్రలను ఎండగట్టారు. సంస్థకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. లాభాల బాటలో నడుస్తున్న సింగరేణిని నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ చేయాలనే కుట్రలను అడ్డుకుటామని పేర్కొన్నారు. సింగరేణిలో ఉద్యోగు లకు అనేక హక్కులు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దేనని, కోలిండియాలో లేని అనేక సంక్షేమ ప్రయోజనాలను అందించారని గుర్తు చేశారు. దీంతో పాటు తాజాగా అసెంబ్లీలో శనివారం మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మాట్లాడుతూ నాలుగు బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించకుండా, కుట్రలకు తెరలేపిందని ధ్వజమెత్తారు. కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా కార్మిక వర్గానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.
సమైక్య రాష్ట్రంలో పడ్డ కష్టాలను స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తొలగించారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కృషి ఫలితంగా కార్మికులకు అనేక హక్కులతో పాటు హితోధిక ప్రయోజనాలు చేకూరాయి. ప్రప్రథమంగా డబుల్ బెడ్రూం క్వార్టర్ల నిర్మాణం, ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత కార్పొరేట్ వైద్యం, పెండింగ్ డిపెండెంట్, కారుణ్య నియామకాల ద్వారా కార్మిక వారసులకు ఉద్యోగాల కల్పన, ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగావ కాశాలు కల్పించారు. దీంతో పాటు ఎన్నో సంక్షేమ ఫలాలు అందించారు. దీంతో స్వరాష్ట్రంలో సంస్థ బొగ్గు ఉత్పత్తి, రవాణాలో రికార్డు స్థాయిలో వృద్ధి రేటు సాధించింది. థర్మల్, సోలార్ విద్యుత్ రంగాల్లోనూ సత్తా చాటుతూ విజయపరంపర కొనసాగిస్తున్నది.
తెలంగాణ వచ్చినంక మా కష్టాలు తీరాయి. ఇప్పుడు కో లిండియాలో లేని అనేక హక్కులు, సంక్షేమ ఫలాలు మేం పొందుతున్నాం. కార్పొరేట్ శక్తుల స్వార్థ లాభం కోసం ప్రైవేట్కు గనులు అప్పగించడం సరికాదు. కోలిండియాలో లేని అనేక ఫలాలు పొందుతున్నామంటే సీఎం కేసీఆర్, కవితక్క వల్లే. కేంద్రంలోని బీజేపీ ప్రైవేటు జపం చేస్తుందే తప్ప, ప్రజలు, కార్మిక సమస్యలు పట్టించుకోవట్లే. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే పనిని కేంద్ర ప్రభుత్వం విరమించు కోవాలి. లేదంటే కార్మిక వర్గం నుంచి నిరసన తప్పదు.
-సందెవేని రాజేందర్, ట్రామర్, కేటీకే 8వ గని, భూపాలపల్లి ఏరియా
మన రాష్ట్రంలోని ఆ నాలుగు బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బేషరతుగా సింగరేణికే కేటాయించాలి. అట్లయితేనే సింగరేణి మనుగడ సాధ్యమ వుతుంది. మున్ముందు మరికొందరికి ఉద్యోగాలు వస్తాయి. ఈ విషయమై ప్రధాని నరేంద్రమోదీ ఆలోచిస్తే మంచిది. సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా అడ్డుకుంటున్నది. అయినప్పటికీ కేంద్రం మొండిగా వ్యవహరిస్తోంది. ఇట్ల పోతే మా కార్మికులమే తగిన బుద్ధి చెబుతాం. రాష్ట్రంలోని ఆ పార్టీ నాయకులు సింగరేణిపై కొట్లాడాలి. వారి నేతలను ఒప్పించాలి.
-రేపాల రమేశ్, బదిలీ వర్కర్, కేటీకే-6, భూపాలపల్లి ఏరియా