ఐనవోలు మార్చి 24 : టీఎస్పీఎస్సీ పేపర్ లీకే జీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆ ర్పై నిరాధార ఆరోపణలు చేస్తే జైలు శిక్ష తప్పద ని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర్రావు హెచ్చరించారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నందనం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న రూరల్ మార్ట్, 1000 మెట్రిక్ టన్నుల గోదాంను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్, టెస్క్యాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రా వుతో కలిసి ప్రారంభించా రు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాహుల్ గాంధీ కూడా ఇలాంటి ఆరోపణలు చేసినందుకే కోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్ష వేసిందని తెలిపారు. అదేవిధంగా రేవం త్రెడ్డి, బండి సంజయ్ కూడా జైలుకు వెళ్తారని ఆయన చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎకరానికి రూ.10 వేలు ఇచ్చిన తర్వాతే తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడాలన్నారు. బండి సంజయ్కి రైతులపై ప్రేమ ఉంటే కేంద్రంతో మాట్లాడి పంటనష్ట పరిహారాన్ని హెక్టారుకు రూ. 25 వేలు పెంచే జీవోను తీసుకురావాలని ఎర్ర బెల్లి డిమాండ్ చేశారు. చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.