దేవరుప్పుల, జూన్ : దేవరుప్పులకు చెందిన ప్రముఖ దారు శిల్పి మర్రి గోపాల్రెడ్డి రూపొందించిన శిల్పాలతో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో శుక్రవారం ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారితోపాటు ప్రదర్శనను కర్రల నుంచి తయారు చేసిన శిల్పాకృతుల్లో గోపాల్రెడ్డి సృష్టిని చూపాడని అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోపాల్రెడ్డి తన పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన వాడు కావడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిండ్ల హరికృష్ణ, దైవజ్ఞశర్మ తదితరులు ఉన్నారు.