పుట్లకు పుట్లు వడ్లను పండిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా మారిందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం దేవరుప్పుల మండలం ధరావత్తండాలో ఐకేపీ, సింగరాజుపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతున్నా లెక్క చేయకుండా రాష్ట్ర సర్కారు వేల కోట్ల రూపాయలు వెచ్చించి మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లు చేస్తూ అన్నదాతకు అండగా నిలిచిందని మంత్రి అన్నారు. ఎనిమిదేళ్లలోనే సీఎం కేసీఆర్ తన పాలనా దక్షతతో రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చారన్నారు. చివరి ధాన్యపు గింజ వరకూ ప్రభుత్వమే కొంటుందని, రైతులు అధైర్య పడాల్సిన పనిలేదన్నారు. ఈ యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా 7వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, రూ.15వేల కోట్లతో ధాన్యం సేకరణకు కార్యాచరణ రూపొందించిందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
తొర్రూరు/పెద్దవంగర/ దేవరుప్పుల, ఏప్రిల్ 13: ’రాష్ట్రంలో ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్ పాలనా దక్షతతో వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని, తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు కేంద్రం కొర్రీలు పెడుతున్నా.. లెక్క చేయకుండా మద్ద తు ధరకు కొనుగోళ్లు చేస్తూ రాష్ట్ర సర్కారు అన్నదాతకు అండగా నిలిచింది’ అని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం తొర్రూరు మండలం కర్కాల గ్రామంలో, పెద్దవంగర మండల కేంద్రంలో, జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండా, సింగరాజుపల్లిలో పీఏసీఎస్, ఐకేపీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్కాలలో పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి దయాకర్రావు మాట్లాడారు. రాష్ట్రంలో యాసంగిలో 7వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, రూ.15వేల కోట్లతో ధాన్యం సేకరణకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ 24 గంటల విద్యుత్ సరఫరాతో పాటు, సాగునీరు అందిస్తుండడంతో నేడు 1.41 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి పెరిగిందన్నారు.
కాళేశ్వరం ద్వారా అందుతున్న సాగునీటితో వేసవిలో సైతం చెరువులు, చెక్డ్యాంలు మత్తడి పోస్తున్నాయన్నారు. రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల నుంచి 65 లక్షల ఎకరాలకు వరి సాగు విస్తీర్ణం పెరిగిందని వివరించారు. గత 8 ఏళ్లలో రూ.కోటి 7 లక్షల కోట్లను ధాన్యం సేకరణ కోసం పెట్టుబడి పెట్టిందని, నేడు తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా నిలిచిందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ వంటి చీడ పురుగులు చేస్తున్న అర్థం లేని రాజకీయాలను రైతులు తిప్పి కొట్టాలని సూచించారు. ‘రైతుల కోసం సీఎం కేసీఆర్ చేసినంత నా 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చేయలేదని, తెలంగాణ రాక ముందు, వచ్చాక జరిగిన అద్భుత ప్రగతిని ప్రజలు విశ్లేషించుకోవాలి’ అని కోరారు. చెల్లింపుల్లో ఆలస్యం జరగకుండా చూడాలని, కొనుగోలు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు.
కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. జిల్లాలో 234 ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేశామని, తొలి కేంద్రాన్ని కరాలలో ప్రారంభించినట్లు తెలిపారు. ఆరబెట్టి శుద్ధిచేసిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ప్రతి కేంద్రంలోనూ అవసరమైన టార్పాలిన్లు, గోనె సంచులు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. దళారులు, ప్రైవేట్ వ్యక్తులకు ధా న్యం విక్రయించి మోసపోవద్దని సూచించారు. జూన్ మొదటి వారం వరకు కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తామని, ఏఈవోలు జారీ చేసిన టోకెన్ల వారీగా ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో రమేశ్, తొర్రూరు ఎంపీపీ తూర్పాటి చిన్నఅంజయ్య, జడ్పీఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, డీసీవో సయ్యద్ ఖుర్షీద్, డీఎం కృష్ణవేణి, డీఎస్వో నర్సింగారావు, డీఏవో ఛత్రూనాయక్, ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ ఎల్ వెంకటనారాయణగౌడ్, తహసీల్దార్ నాగేంద్రప్రసాద్, ఎంపీడీవో ఎస్ కుమార్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు ఆర్ కిశోర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీ సీతారాములు, సర్పంచ్ ఎస్ సురేఖా సురేందర్, ఎంపీటీసీ వీ గోపమ్మా మల్లయ్య, ఉపసర్పంచ్ పీ వెంకన్న, మండల కోఆప్షన్ సభ్యుడు అంకూస్, పీఏసీఎస్ సీఈవో మురళి, డైరెక్టర్లు జనార్దన్రాజు, ఎం ప్రకాశ్, లింగయ్య పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
దేశంలోనే తెలంగాణ ధాన్యాగారంగా నిలిచిందని, రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి దయాకర్రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సాయిగార్డెన్స్లో ముస్లింలకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్లను అందించి, అనంతరం పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని, సీఎం కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రాష్ర్టాన్ని కోనసీమను తలపించేలా కృషి చేశారన్నారు. యాసంగిలో వరి ధాన్యం మద్దతు ధరను ఏ-గ్రేడ్కు రూ.2.60వేలు, బీ-గ్రేడ్ ధాన్యానికి రూ.2.40 వేలు నిర్ణయించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి మనమంతా అండగా ఉండాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతు పండించిన పంటలకు ఎందుకు మద్దతు ధర ఇవ్వడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలోని రైతులు అధైర్య పడొద్దని, పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామన్నారు. అక్రమాలకు పాల్పడినా, సన్న ధాన్యానికి మద్దతు ధర చెల్లింపులో మోసాలు చేసినా ఉపేక్షించేది లేదని, అవసరమైతే టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల గురించి ఆలోచించే సీఎం కేసీఆర్ ఉండడం మన అదృష్టమన్నారు.
తెలంగాణలో అన్ని మతాలకు ప్రాధాన్యం
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని మతాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారని మంత్రి దయాకర్రావు అన్నారు. మండల పరిధి అన్ని గ్రామాల్లోని ముస్లింల అభివృద్ధి పనులకు రూ.5లక్షల ఎస్డీఎఫ్ నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించి, వెంటనే పనులు చేసేలా అధికారులను ఆదేశించారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా, సర్వమత సమానత్వమే లక్ష్యంగా పండుగలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజేశ్వరి, జడ్పీటీసీ జ్యోతిర్మయి, తహసీల్దార్ రమేశ్బాబు, ఎంపీడీవో వేణుగోపాల్రెడ్డి, డీపీఎం నళినీ నారాయణ, డీఎస్డీఎం కృష్ణవేణి, డీసీవో ఖుర్షీద్, పీఏసీఎస్ చై ర్మన్ హరిప్రసాద్, మండల ప్రత్యేకాధికారి ఖుర్షీద్, ఏవో కుమార్యాదవ్, ఏపీడీ వెంకట్, ఏపీఎం నరేంద్రకుమార్, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్యశర్మ, రైతుబంధు సమితి జిల్లా, మండల సభ్యులు నెహ్రూనాయక్, సోమనర్సింహారెడ్డి, మండల కన్వీనర్ సోమారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మండల కోఆప్షన్ సభ్యుడు ముజిబుద్దీన్, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఐలయ్య, సంజయ్, నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు.