దేవరుప్పుల, ఆగస్టు 27 : చినమడూరు-రాంభోజీగూడెం మధ్యనున్న వాగుపై సుమారు రూ.5 కోట్లతో హైలెవల్ వంతెన నిర్మించి ప్రజల సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తద్వారా ఆయా గ్రామస్తుల చిరకాల కోరిక నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. మండలంలోని రాంభోజిగూడేనికి మంత్రి ఎర్రబెల్లి శనివారం వచ్చారు. ఈ సందర్భంగా రెండు గ్రా మాల ప్రజలు మంత్రిని కలిసి వాగుపై వంతెన నిర్మాణం చేపట్టి తమ కష్టాలు తీర్చాలని కోరారు. చెక్డ్యాముల నిర్మాణంతో సంవత్సరంలో ఎక్కువ రోజులు వాగులో నీరు ప్రవహిస్తుందన్నారు. దీంతో ప్రతిరోజూ చినమడూరు పాఠశాలకు వెళ్లే ఉపాధ్యాయులు, ప్రయాణికులు, రెండు గ్రామాల రైతులు, వృత్తిదారులు నానా ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లను ఆదేశిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలు తీర్చేలా వంతెన నిర్మాణాన్ని చేపడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు వంగ పద్మ, సింగిరెడ్డి సరిత, ఎంపీటీసీ గొడుగు సుజాత, నాయకులు వంగ వెంకటేశ్వర్లు, సింగిరెడ్డి సతీశ్, గొడుగు మల్లికార్జున్, బాషిపాక సోమయ్య, సొసైటీ డైరెక్టర్ కృష్ణమూర్తి, ఆయా గ్రామాల టీఆర్ఎస్ అధ్యక్షులు జనగామ సంతోష్, చెంచు మల్లారెడ్డి, మొల్గూరి సంతోష్, చినమడూరు ఉపసర్పంచ్ కంకటి యాదగిరి పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి పరామర్శ
దేవరుప్పుల మండలం రాంభోజీగూడెం గ్రామ శివారు రాజీవ్నగర్కు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు గొడుగు అబ్బయ్య అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుడి భార్య వెంకటమ్మ, కుమారులు రవి, మధును ఆయన ఓదార్చారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా అబ్బయ్య అందించిన సేవలు మరువలేనివన్నారు. పరామర్శించిన వారిలో స్థానిక సర్పంచ్ సింగిరెడ్డి సరిత, ఎంపీటీసీ గొడుగు సుజాత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, నాయకులు బస్వ మల్లేశ్, కొల్లూరు సోమయ్య, వంగ వెంకటేశ్వర్లు , గొడుగు మల్లికార్జున్, కోతి ప్రవీణ్, కొత్త జలేందర్రెడ్డి, బస్వ వెంకన్న, రాంభోజీగూడెం టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు చెంచు మల్లారెడ్డి, చినమడూరు గ్రామ అధ్యక్షుడు జనగామ సంతోష్, ఉపసర్పంచ్ కంకటి యాదగిరి, మొల్గూరి సంతోష్, సతీశ్, మేడ సోమనర్సయ్య, బాషిపాక సోమయ్య, సొసైటీ డైరెక్టర్ ముసిగుంపుల కృష్ణమూర్తి, కోలుకొండ సర్పంచ్ కూర్నాల రవి, నల్లకుంట తండా సర్పంచ్ బానోత్ రాజన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోనగిరి యాకస్వామి పాల్గొన్నారు.