హనుమకొండ, ఆగస్టు 24 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరామర్శించారు.
బుధవారం ఎమ్మెల్సీ ఇంటికి వెళ్లిన ఆయన బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్సీని కవితను కలిసిన వారిలో మంత్రితో పాటు రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, టీఎస్ రెడో చైర్మన్ సతీశ్రెడ్డి తదితరులు ఉన్నారు.