సబ్బండ వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ సమ ప్రాధాన్యమిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాయపర్తి మండల కేంద్రంలో గురువారం ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ చేసి, యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ అన్ని మతాల పండుగలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీలను భూ స్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని, రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవొద్దని ఆయన కోరారు.
రాయపర్తి, ఏప్రిల్ 13 : రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో ముస్లింకు ఆయన రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భం గా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని మతాలు, కులాలను సమ దృష్టితో ఆదరి స్తూ సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అన్ని మతాల పర్వదినాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తూ, రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నదన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే పార్టీలను భూ స్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ముస్లింలు అలుపెరుగని శ్రమజీవులని మంత్రి అన్నారు.
కష్టించే తత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ముస్లిం కుటుంబాలు ఆశించిన స్థాయిలో చదువుకు నోచుకోవడం లేదన్నారు. అందుకే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మైనార్టీల గురుకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అన్ని గ్రామాల్లోని ముస్లింల సమగ్రాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ కోట శ్రీవత్స, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, జిల్లా నాయకుడు బిల్లా సుధీర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీలు అయిత రాంచందర్, బిల్లా రాధిక సుభాష్రెడ్డి, ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్, ఏపీవో దొణికెల కుమార్గౌడ్, ఏవో గుమ్మ డి వీరభద్రం, మసీద్-ఏ-నూర్ సదర్సాహెబ్ మహ్మద్ లాయక్అలీ, మసీద్-ఏ-ఆలంగీర్ సదర్సాహెబ్ మహ్మద్ నయీం, నాయకులు పూస మధు, మహ్మద్ ఉస్మాన్, అక్బర్, వనజారాణి పాల్గొన్నారు.
రైతుల కండ్లలో ఆనందమే కేసీఆర్ లక్ష్యం..
రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పండుగ వాతావరణంలోకి తీసుకురావడంతోపాటు రైతుల కండ్లలో ఆనందం చూడడమే సీఎం కేసీఆర్ ఏకైక లక్ష్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మండల కేంద్రంలోని రైతువేదిక ఆవరణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేసిన యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 39 గ్రామాల పరిధిలో ఐకేపీ, మహిళా స్వయం సహాయక సంఘాలు, పీఏసీఎస్ల నిర్వహణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన వివరించారు. ధాన్యం విక్రయాల విషయంలో రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఆయన సూచించారు. అనంతరం ధాన్యపు బస్తాలను ఆయన హమాలీలతో కలసి తూకం వేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కుందూరు రాంచంద్రారెడ్డి, డీసీవో సంజీవరెడ్డి, సీఈవో ఏడాకుల సోమిరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు, రైతులు, సిబ్బంది అయిత మల్లేశ్, ఓరుగంటి రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.