పర్వతగిరి, ఫిబ్రవరి 18 : సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. మహా శివరాత్రి సందర్భంగా పర్వతగిరిలోని పర్వతాల శివాలయంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి స్వామి వారికి క్షీరాభిషేకం, జలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని శివుడికి ప్రత్యేక పూజలు చేశామని చెప్పారు. యాదాద్రి, వేములవాడ, కొండగట్టు ఆలయాలను గత పాలకులు పట్టించుకోలేదన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. కాకతీయుల స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ దేవాలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువస్తున్నారని స్పష్టం చేశారు.
అనంతరం మంత్రి, ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమల పంతులు, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్కుమార్గౌడ్, సర్పంచ్ మాలతీ సోమేశ్వర్రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పట్టపురం ఏకాంతంగౌడ్, మాజీ వైస్ చైర్మన్ ఏడుదొడ్ల జితేందర్రెడ్డి, ఎంపీటీసీ మాడ్గుల రాజు, మండలాధ్యక్షుడు రంగు కుమార్గౌడ్, మాజీ ఎంపీపీ రంగు రజిత, దుర్గారావు, వెంకటేశ్వర్రావు, రంగు జనార్దన్గౌడ్, పంతులు, చిదురాల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో రుద్రాభిషేకం వేడుకగా సాగింది. పర్వతాల శివాలయం ఎదురుగా ఉన్న పెద్ద చెరువు రిజర్వాయర్లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బోటింగ్ ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున శివయ్యను దర్శించుకున్న అనంతరం బోటింగ్ చేసి సంతోషంగా గడిపారు.