రాయపర్తి, నవంబర్ 24 : ప్రజానాయకుడికి అలుపూ అలసట ఉండదు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే ప్రజాప్రతినిధికి నిత్యం అదే యాస.. ధ్యాస. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభివృద్ధికి, సంక్షేమానికి పెట్టింది పేరు. ప్రజల మని షిగా, ఓటమెరుగని నాయకుడిగా, ప్రజల మనసులో సుస్థిర స్థానం ఏర్పర చుకున్న నేత. అభిమానించే ప్రజల శ్రేయస్సు, ప్రగతికి పాటుపడడమే నిజమైన సేవగా భావించి.. రాత్రనకా, పగలనకా పనిచేస్తారు. ఇందులో భాగంగా గురు వారం రాత్రిపూట వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలో చిన్న పిల్లల విద్యాభ్యాసం కోసం నిర్మిస్తున్న ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
విద్యాలయాలు ఆధునిక ప్రగతి భవనాలని, నాణ్యత లో ఎక్కడా రాజీ పడకుండా వేగవంతంగా పనులు పూర్తి చేయాలని అధికారుల కు ఆదేశాలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యకు అత్యంత ప్రా ధాన్యత ఇస్తున్నారని, మౌలిక వసతుల ఏర్పాటుకు ఎక్కువ నిధులు వెచ్చి స్తున్నారని తెలిపారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మూడు తరగతి గదుల నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.52లక్షలతో పనులు చేస్తున్నట్టు చెప్పారు.