హనుమకొండ, జూలై 20: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తు న్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రక టించడంతో మంత్రి సత్యవతి రాథోడ్, ఉమ్మడి జిల్లా పరి ధిలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, సీపీ, ఎస్పీ, ఇతర అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వ హించారు. జిల్లాలో నమోదవుతున్న వర్షపాతం, వరద లు, లోతట్టు ప్రాంతాలు జలమయం, వరద బాధితు లను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అత్యవసర పరిస్థితుల్లో, రెస్యూ టీమ్స్, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల పరిస్థితిని, వాళ్లు తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలను ఆయా జిల్లాల కలెక్టర్లు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, మంత్రి సత్యవతిరాథోడ్, ప్రజా ప్రతినిధులకు వివరించారు.
అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్ ఉన్నందున వర్షాలు, వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమైనా సమస్య లను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువస్తే వెంటనే అధికా రులకు తెలియజేయాలన్నారు. అలాగే సమస్యలకు తగి న విధంగా సహాయ సహకారాలు అందించాలని ప్రజా ప్రతినిధులకు మంత్రి సూచించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నా రు. నియోజకవర్గ పరిధిలో ప్రజలను అప్రమత్తం చేయా ల్సిన బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని కోరారు. పోలీసు అధికారులతో పాటు రెస్యూ టీమ్స్ని సిద్ధం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించా రు. ఏ సమయంలో ఏ సమస్య వచ్చినా వెంటనే అధికా రులు అప్రమత్తతతో సహాయ సహకారాలు అందించేం దుకు సిద్దంగా ఉండాలని మంత్రి ఆదేశించా రు. అలాగే జిల్లా కలెక్టరేట్లలో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. లోతట్టు, ముప్పు ప్రాంతాల్లో, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలోని ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు గానీ, పునరావాస కేంద్రాలు గానీ ఏర్పాటు చేసి అకడికి చేర్చాలన్నారు. పునరా వాస కేంద్రాల్లో వారికి భోజన సదుపాయం కల్పించా లని అధికారులను ఆదేశించారు.