పెద్దవంగర, నవంబర్ 4 : గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధి బాట పట్టించిన ఘనత సీఎం కేసీఆర్దేనని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం ఆయన కాన్వాయిగూడెం, కొత్తతండా, మేఘ్యాతండా, బలుసుల తండా, అమర్సింగ్ తండా, రంగి తండా, బత్తాయితోట తండా, శంకర్ తండా, సర్పంచ్ తండాల్లో ప్రచారం నిర్వహించారు. మహిళలు సంప్రదాయ పద్ధతుల్లో నృత్యం, బతుకమ్మలతో మంత్రికి ఘనస్వాగతం పలికారు. ఆయా తండాల్లో మంత్రి ఇంటింటికీ తిరుగుతూ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ, ఓటు అభ్యర్థించారు. ఆయా తండాల్లో ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సుమారు రూ.కోటి వెచ్చించి ఒకో గ్రామాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.
గిరిజనులు, ఆదివాసీల ఏండ్ల గోసను సీఎం కేసీఆర్ ఎడబాపి, వారి అభివృద్ధికి పాటుపడుతుంటే, ఎస్టీల్లో వర్గీకరణ చిచ్చుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. కాం గ్రెస్, బీజేపీని నమ్ముకుంటే నట్టేట మునుగుతామన్నారు. 3 గంటల కరెంటు చాలంటున్న కాంగ్రెస్ను రైతులు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలను విభజించి పాలించే కుట్ర లు పన్నుతున్న కాంగ్రెస్, బీజేపీ నేతలను నియోజకవర్గంలో కాలుపెట్టనివ్వొద్దన్నారు. మన కోసం తపన పడుతున్న కేసీఆర్కు గెలిపించుకోవాలన్నారు. కాన్వాయిగూడెంలో కాసాని మల్లమ్మ అనే వృద్ధురాలిని మంత్రి ఆప్యాయంగా పలుకరించి అక్కున చేర్చుకున్నారు. ‘అవ్వా బాగున్నావా.. పింఛన్ వస్తాందా.. ఓటు ఏవలికేస్తావు’ అని పలుకరించగా, నీకే వేస్తాను కొడుకా’ అంటూ మల్లమ్మ బదులివ్వడంతో మంత్రి సం తోషం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్లో పలువురి చేరిక
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు రాయపర్తి యాదవ సంఘం నాయకులు మద్దతు పలికారు. అలాగే తొర్రూరు మండల కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షుడు వీరమనేని రాజు, ఉప్పరగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వేముల రఘు బీఆర్ఎస్లో చేరగా, మంత్రి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, నామినేషన్ ఖర్చుల నిమిత్తం తొర్రూరు మండలం మడిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ సాయి లు – మాధవి దంపతులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రూ.10వేలు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి వారిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జిలు సోమేశ్వర్రావు, గోపాల్రావు, పాలకుర్తి దేవస్థాన, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ రామచంద్రయ్యశర్మ, జిల్లా, మండల రైతుబంధు సభ్యులు కిశోర్రెడ్డి, సోమనర్సింహారెడ్డి, మండల అధ్యక్ష, కార్యదర్శులు ఐలయ్య, సంజ య్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సోమారెడ్డి, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, ఎంపీటీసీలు శ్రీనివాస్, రవీందర్నాయక్, విజయ, సబిత, మాజీ జడ్పీటీసీ కమలాకర్నాయ క్, నాయకులు యాదగిరిరావు, సుధీర్కుమార్, సునీల్రెడ్డి, మనోహర్, సుధాకర్, సత్యానారాయణ, ఆంజనేయులు, అం జయ్య, చంద్రయ్య, రాజుయాదవ్, కుమార్యాదవ్, యూత్ నాయకులు హరీశ్, అనుదీప్, యాకన్న పాల్గొన్నారు.