పర్వతగిరి, డిసెంబర్ 27 : రైతు బిడ్డ పొలాన్ని చూస్తే మురిసిపోతాడు.. వ్యవసాయాన్ని చూస్తే ఉరకలేస్తాడు.. తోటోళ్లు పొలం పనులు చేస్తుంటే తనూ ఆగలేడు.. ఎర్రబెల్లి దయాకర్రావు రాష్ర్టానికి మంత్రి అయినా రైతుకు బి డ్డే.. మంగళవారం స్వగ్రామానికి వచ్చిన ఆయన పర్వతగిరిలోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలోని పొలం పనులను చూసి ఆగలేకపోయాడు. వెంటనే పొలంలోకి దిగి గొర్రు పట్టి ఎడ్లను ఆయిస్తూ పొలం దున్నాడు. అందరు కూలీలతో కలిసి సంతోషంగా గడిపారు. మహిళా కూలీల తో గొంతుకలిపి నాట్లు వేసి వారిలో ఉత్సాహం నింపారు. దండగ అన్న వ్యవసాయాన్ని మన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ పండుగ చేస్తే.. ఆ వ్యవసాయాన్ని మంత్రులు కూ డా ఫలప్రదం చేస్తున్నారు. తమదైన శైలిలో రైతుల్లో ఉత్సా హం నింపుతున్నారు. వీరి ప్రోత్సాహంతో ఎక్కువ మంది వ్యవసాయం చేయడంతో నేడు రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా మారింది. అపర భగీరథుడు కేసీఆర్ ఆలోచనలతో ని ర్మించిన ప్రాజెక్టులతో చెరువులు, కుంటలు నిండి ఊరూవాడ చేను చెలక మళ్లీ ప్రాణం పోసుకుని పరవశిస్తున్నాయి.
సంగెం, డిసెంబర్ 27 : కాటమయ్య గుడిజాతర సందర్భంగా మంగళవారం సాయంత్రం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్ జిల్లా సంగెం మండలం చింతలపల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఎర్రబెల్లికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఆత్మీయ పలకరింపుతో అక్కున చేర్చుకున్నారు. ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించే మంత్రి దయాకర్రావు కూడా అంతే ఉత్సాహంతో ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరినీ పేరుపెట్టి పలుకరించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. చింతలపల్లిలో దయాకర్రావు అభిమాని బొమ్మ సదానందంగౌడ్ ఇటీవల తాటిచెట్టు మీద నుంచి పడి గాయాలు కాగా, ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం కాటమయ్య గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, ఎంపీటీసీ పావనీ యుగేంధర్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గుండేటి బాబు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సారంగపాణి, నాయకులు సదయ్య, సొసైటీ చైర్మన్ కుమారస్వామియాదవ్, అప్పె నాగార్జునశర్మ, నల్లతీగల రవి, మునుకుంట్ల మోహన్, మన్సూర్అలి పాల్గొన్నారు.