భీమదేవరపల్లి, ఆగష్టు 18 : రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని ముల్కనూరు ప్రజాగ్రంథాలయంలో మహనీయులు మహాత్మ జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలే, ఆచార్య జయశంకర్ విగ్రహాలను ఆవిష్కరించారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, కరీంనగర్ సుడా చైర్మన్ జీవీ కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ మహనీయుల విగ్రహాలు ప్రతిష్ఠించడం వల్ల వారి పోరాటాలు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతాయన్నారు. 40 ఏళ్ల నా రాజకీయ జీవితంలో పేదవారికోసం అహర్నిశలు శ్రమించిన ఇద్దరు నేతలను చూశానన్నారు. ఒకరు ఎన్టీ రామారావు అయితే మరొకరు మన కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్షకోట్లు మింగారని తెలివితక్కువ వాళ్లు మాట్లాడుతున్నారన్నారు. అలాగే, రైతులకు మూడు గంటలు మాత్రమే కరెంటు చాలని ఓ సన్నాసి అంటున్నాడన్నారు. రాష్ట్రం రాకముందు కరెంటు, నీళ్లకోసం అరిగోస పడినామన్నారు. కాంగ్రె స్, బీజేపోళ్ల మాటలు ఎవరూ పట్టించుకోవద్దని సూచించారు. సీఎం కేసీఆర్ రుణమాఫీ ఇవ్వడంతో ప్రతిపక్షాలు పూర్తిగా కిందపడిపోయాయన్నారు. సీఏలు, వీవోఏలు వారం రోజుల్లోగా శుభవార్త వింటారన్నారు. వారం రోజుల్లోగా ఎమ్మెల్యే సతీశ్ అడిగిన నిధులు, పంచాయతీ నూతన భవన నిర్మాణం కోసం వినోద్ కుమార్ అడిగిన నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. సతీశ్ కుమార్ను మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
చెప్పినవే కాదు.. చెప్పనివి కూడా చేశాం
రాష్ట్ర ప్రభుత్వం చెప్పినవి మాత్రమే కాకుండా చెప్పనివి కూడా చాలా చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. విద్యకోసం పరితపించిన మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. చేయిచేయి కలిపి ముల్కనూరు ప్రజాగ్రంథాలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని భరించలేక ‘దగాపడ్డ తెలంగాణ’ అనే పుస్తకాన్ని జయశంకర్ సార్ రాశాడని గుర్తు చేశారు. ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ మాట్లాడుతూ ముల్కనూరు ప్రజాగ్రంథాలయంలో మహనీయుల విగ్రహాలను ప్రతిష్టించడం యువతకు ఆదర్శనీయమన్నారు. యువత కాంపిటేటవ్ పరీక్షలకు సన్నద్దం అయ్యేందుకు ఈ గ్రంథాలయం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ముల్కనూరులో కల్యాణ మండపం నిర్మా ణం కోసం సొంత నిధుల నుంచి రూ.50లక్షలు ఇస్తానని, మరిన్ని నిధులు మంత్రుల ద్వారా తీసుకొస్తానని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ మహనీయులను కీర్తించుకోవడం హర్షణీయమన్నారు. జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, కరీంనగర్ సుడా ఛైర్మన్ జీవీ కృష్ణారావు హాజరయ్యారు. ఎంపీపీ జక్కుల అనితరమేశ్, జడ్పీటీసీ వంగ రవి, వైస్ ఎంపీపీ మాడుగుల ఎజ్రా, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి రాజిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మండల సురేందర్, సర్పంచ్ మాడుగుల కొంరయ్య, ఎంపీటీసీలు బొల్లంపల్లి రమేశ్, అప్పని పద్మ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మార్పాటి మహేందర్రెడ్డి, నాయకులు మాక లాజరస్, నవాబ్పాషా, శనిగరం సదానందం, ఎల్తూరి ప్రభాకర్, విగ్రహ ప్రతిష్టాపన కమిటీ నాయకులు డ్యాగల సారయ్య, ఎదులాపురం తిరుపతి, చెప్యాల ప్రభాకర్, కండె సుధాకర్, మాట్ల వెంకటస్వామి, చెప్యాల ప్రకాశ్, అంబాల చక్రపాణి పాల్గొన్నారు.