తొర్రూరు, మే 9 : ‘తొర్రూరును మున్సిపాలిటీ చేసుకున్నం. ఇప్పటికే రూ.152 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నం. తాజాగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన రూ.50 కోట్లతో పాటు అమృత్ పథకం కింద వచ్చిన రూ.25 కోట్ల నిధులు కలిపి మొత్తం రూ.75 కోట్లతో మరింత అభివృద్ధితోపాటు నిరంతర తాగునీటి సరఫరాకు కృషి చేస్తున్నాం’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. తొర్రూరు పట్టణంలో మంగళవారం 1,2,3,4,6,7,8,10 వార్డుల పరిధిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రతి ఒకరూ పరిశీలించుకోవాలి.. కాంగ్రెస్ పాలనలో తొర్రూరు పట్టణం ఎలా ఉండేది? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలా ఉందని బేరీజు వేసుకోవాలి.
రెవెన్యూ డివిజన్గా, మున్సిపల్ కేంద్రంగా ఉన్నతీకరించిన తర్వాత రూ.152 కోట్లతో ఐదేళ్లలో ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చేసినం.. ఇంకా చేస్తూనే ఉన్నం’ అని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మంజూరు చేసిన రూ.25 కోట్లు, మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన రూ.25 కోట్లకు తోడు అమృత్ పథకం ద్వారా 24 గంటల పాటు శుద్ధి చేసిన తాగునీటిని అందించేందుకు మంజూరైన రూ.25 కోట్లు కలిపి ఈ 6నెలల్లోనే రూ.75 కోట్ల విలువైన పనులు కొత్తగా చేపట్టనున్నట్లు తెలిపారు. తొర్రూరు పెద్ద చెరువు అభివృద్ధి, నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణం, ఇండోర్ స్టేడియం, ప్రజలందరికీ ఉపయోగపడేలా భారీ కమ్యూనిటీ హాల్, టీచర్స్ కాలనీ నుంచి పాలకేంద్రం వరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్ విస్తరణ, హైమాస్ లైట్ల ఏర్పాటు, అవసరమున్న చోట డ్రైనేజీ నిర్మాణం, వరద నీటి మళ్లింపునకు కాల్వల నిర్మాణం, బుడగ జంగాలు, ఎస్సీలు, వివిధ కులాల కోసం కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక అభివృద్ధి, సీసీ రోడ్లు ఇలా తొర్రూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ‘మీ ఆశీర్వాదంతో గెలిచాను.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మంత్రినయ్యా. మీ రుణం తీర్చుకుంటూ మీరు మెచ్చే, మీకు నచ్చే విధంగా పని చేస్తా’నని భరోసా ఇచ్చారు. ఈ నెలాఖరులోగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో పెండింగ్లో ఉన్న పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. వార్డుల వారీగా జాబితాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు.
లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి
తొర్రూరులోనే అత్యధికంగా డబుల్ బెడ్రూం ఇండ్ల ను మంజూరు చేశామని, 726 గృహాలు మంజూరు చేయగా, 412 గృహాలు పూర్తయ్యాయని, రెండు రోజు ల్లో వార్డుల వారీగా పాదర్శకంగా పార్టీలతో ప్రమేయం లేకుండా డ్రా పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక జరగాలని ఆదేశించారు. ఎక్కడా బద్నాం కావొద్దని, చెడ్డ పేరు తె చ్చుకోవద్దని పార్టీ నేతలకు సూచించారు. ఖాళీ స్థలాలు ఉన్న వారికి రెండు దశలుగా గృహ నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చా రు. దళిత బంధు సంబంధించి గతంలోనే 500 మంది కి నిధులు ఇచ్చామని, మరో 500 మంది ఎంపిక వెంటనే చేయాలన్నారు.
ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా కుట్టు శిక్షణ..
పాలకుర్తి నియోజకవర్గంలో 10వేల మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ ప్రారంభించామని, మూడు విడుతల్లో 3 వేల మందికి ప్రభుత్వ నిధులతో శిక్షణ ఇప్పించి, 10వ తరగతి పూర్తి చేసిన వారికి వరంగల్ టెక్స్టైల్ పార్లో ఉద్యోగ అవకాశా లు కల్పించనున్నట్లు తెలిపారు. మిగిలిన 7 వేల మంది మహిళలకు ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా రూ.10కోట్ల వెచ్చిం చి కుట్టు శిక్షణ ఇప్పిస్తామని, తొర్రూరు మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో 50 మంది చొప్పున మహిళలను శిక్షణ కోసం ఎంపిక చేయాలన్నారు. ఇందులో 10వ తరగతి పూర్తి చేసిన వారు విధిగా 25 మంది ఉండాల ని కౌన్సిలర్లను, వార్డు ఇన్చార్జిలకు సూచించారు. జూలై ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న యువతకు, కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు వరంగల్ టెక్స్టైల్ పార్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ప్రకటించారు.
కంపెనీ వారే రవాణా సదుపాయాన్ని, భోజన వసతిని కల్పిస్తారని, యువకులకు కూడా నెల కు రూ.12వేల చొప్పున వేతనం అందజేసి శిక్షణ ఇస్తారని, ప్రతిభ ఆధారంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తారని వివరించారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎ ర్రబెల్లి ఉషా దయాకర్రావు ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మీయ అతిథిగా పాల్గొని ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా చేస్తు న్న సేవలను వివరించారు. మంత్రి ఎర్రబెల్లి నిరంతరం నియోజకవర్గ ప్రజల కోసం పరితపిస్తారని, అభివృద్ధే ఊపిరిగా పని చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్కు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి దయాకర్రావు మహిళలు, పార్టీ శ్రేణులకు స్వయంగా వడ్డిస్తూ సహఫంక్తి భోజనాలు చేశారు. పట్టణ అధ్యక్షుడు రామిని శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, ఎంపీ పీ తూర్పాటి చిన్న అంజయ్య పాల్గొన్నారు.