ఖిలా వరంగల్: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించేందుకు ఈనెల 18న జరగబోయే తెలంగాణ రాష్ట్ర బీసీ బంద్ను జయప్రదం చేయాలని టీఎస్ ఆర్డీసీ మాజీ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ పూటకో మాట మాట్లాడుతుందని విమర్శించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ నుంచి నేటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని చెప్పారు. చట్టసభల్లో బిల్లు, ఆర్డినెన్స్, జీవో అని చెబుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నాడని విమర్శించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తొలినాళ్లలోనే ఉద్యమ నాయకుడు, మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో ఓ బీసీ శాఖ ఉండాలని, అలాగే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ఘనత ఉద్యమ నాయకుడు కేసీఆర్ దని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా పోరాడుతుందని గుర్తు చేశారు. రాజ్యసభకు ఎంపీలను ఎక్కువ మందిని బీసీలను పంపిందని తెలిపారు.
అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు తెలపడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడడానికి సైతం పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్, బిజెపి ఆడుతున్న ద్వంద వైఖరిని ఎండగడతామని హెచ్చరించారు. రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్ సాధ్యమని అందుకోసం పోరాటమే మార్గమని చెప్పారు. తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. బీసీలందరూ కలిసి రావాలని కోరారు .