స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 24 : యువతలో దాగిఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకే వరంగల్ ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని నమిలిగొండలో కడియం ఫౌండేషన్ సహకారంతో కడియం యువసేన నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు శనివారం నాటికి 9వ రోజుకు చేరాయి. పోటీలను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ ఆటల పోటీల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడినవారు భవిష్యత్లో మరిన్ని జాగ్రత్తలతో విజయం కోసం కృషి చేయాలన్నారు. క్రీడలతో యువతలో స్నేహభావం పెంపొందుతుందన్నారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న టోర్నమెంట్లో 70 టీమ్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. ప్రతి రోజూ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు వసతి కల్పించామని, ప్రతి క్రీడాకారుడికి కడియం ఫౌండేషన్ ద్వారా మెమొంటోలు ఇస్తామన్నారు.
క్రికెట్ పోటీలకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న టీమ్లు పోటీలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ల సంఘః రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తీగల కరుణాకర్ రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు బెలిదె వెంకన్న, బానోత్ రాజేశ్ నాయక్, చింతకుంట్ల నరేందర్ రెడ్డి, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య, స్టేషన్ఘన్ఫూర్, చిల్పూరు మండలాల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పోగుల సారంగపాణి, మామిడాల లింగారెడ్డి, ఎంపీటీసీలు బూర్ల లతాశంకర్, రజాక్ యాదవ్, దేవేందర్, సర్పంచ్లు కోతి రేణుకారాములు, గాదెపాక అనితా సుధాకర్బాబు, ఎడ్ల వెంకటస్వామి, కడియం యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్మకంటి నాగరాజు, కడియం యువసేన నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జి హఫీజ్, ధర్మసాగర్, చిల్పూరు, జఫరగఢ్ మండలాల అధ్యక్షులు ప్రవీణ్, విజయ్, అశోక్, సభ్యులు బూర్ల రాజు, నాగరాజు, సంపత్రాజ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గ ప్రజలకు, క్రైస్తవులకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రిస్మస్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను, అన్ని వర్గాల ప్రజల పండుగలను గౌరవిస్తున్న తెలంగాణ ప్రభుత్వం చల్లగా ఉండేలా తమ ప్రార్ధనలో ఏసుప్రభువు ఆశీర్వదించేలా చూడాలని పాస్టర్లను, దైవ జనులను కడియం శ్రీహరి కోరారు.