మహదేవపూర్, జూన్ 27 : ఎగువన కురుస్తున్న వర్షాలతో మేడిగడ్డ బరాజ్కు వరద వస్తోంది. గురువారం 8,790 క్యూసెక్యులు రాగా, అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్ రక్షణ చర్యలో భాగంగా ఎన్డీఎస్ఏ ఆదేశాలమేరకు గ్రౌటింగ్, షీట్ ఫైల్స్ పనులు పూర్తికాగా, అప్ అండ్ డౌన్ స్ట్రీమ్లో చేపట్టిన సీసీ బ్లాక్ రీ అరేంజ్మెంట్ పనులు తుది దశలో ఉన్నాయి. బరాజ్లోని మొత్తం 85 గేట్లకు 84 ఎత్తి ఉంచగా, ఏడో బ్లాక్లోని 20వ గేట్ కటింగ్ చేసి విడిభాగాల తొలగింపు పనులను గురువారం పూర్తిచేశారు. బరాజ్ రక్షణ చర్యల్లో భాగంగా ఎన్డీఎస్ఏ ఆదేశాల మేరకు చేపట్టిన గ్రౌటింగ్, సీకెంట్ ఫైల్స్ పనులు పూర్తి కాగా బరాజ్ అప్, డౌన్ స్ట్రీమ్లో చేపట్టిన సీసీ బ్లాక్ రీ అరేంజ్మెంట్ పనులు తుది దశలో ఉన్నాయి. బరాజ్ వద్ద పనులను భారీ నీటిపారుదల శాఖ ఈఈ తిరుపతిరావు పరిశీలించారు.
యిగూడెం : మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద గోదావరి వరద ప్రవాహం రోజురోజుకు పెరుగుతున్నది. గురువారం ఎగు వ నుంచి గోదావరిలోకి 9,700 క్యూసెక్కుల వరదనీరు వస్తుండడంతో 32 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.