తాడ్వాయి, మార్చి17 : మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. సెలవుల్లో భక్తులు తల్లుల దర్శనానికి క్యూ కడుతున్నారు. ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి అమ్మవార్ల దీవెనలు పొందారు. మొదటగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
మేడారంలో పుణ్యస్నానం చేసేందుకు జంపన్నవాగులోకి దిగి ఓ భక్తుడు మృతి చెందాడు. ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని పోచమ్మ బస్తీకి చెందిన రాపాని రాజు(22)ఆదివారం కుటుంబ సభ్యులతో మేడారానికి వచ్చారు. స్నానాలు చేసేందుకు కొత్తూరు సమీపంలోని లోలెవల్ కాజ్వే వద్దకు చేరుకున్నారు. రాజు ముందుగా వాగు లోతు తెలియక దిగి మునిగిపోయాడు. పస్రా సీఐ శంకర్ ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు నీలకంఠేశ్వర్, వెంకటేశ్వర్రావు వాగులోకి దిగి మృతదేహాన్ని వెలికితీశారు.