ములుగు, డిసెంబర్ 11(నమస్తేతెలంగాణ) : మేడారం మహా జాతర అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ భక్తులకు శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు ఉపయోగపడేలా చూడాలని పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అ న్నారు. సోమవారం హైదరాబాద్లోని డీఎస్ఎస్ భవనంలో మేడారం జాతర రివ్యూ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చోగ్తూ, ఐటీడీఏ పీఓ అంకిత్, సహాయ కార్యదర్శి సర్వేశ్వర్రెడ్డి, ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం ఈఈ ప్రేమలత, మేనేజర్ శంకర్ పాల్గొన్నారు.