సుబేదారి, జూలై 11: కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్పెక్టర్లు, 17 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ ఏవీ రంగనాథ్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. పరకాల ఇన్స్పెక్టర్ పి.కిషన్ను వీఆర్కు బదిలీ కాగా, ఆయన స్థానంలో వీఆర్లో ఉన్న వెంకటరత్నం నియామకమయ్యారు. గీసుగొండ ఇన్స్పెక్టర్ ఎస్.రాజు వీఆర్కు బదిలీ కాగా, ఆయన స్థానంలో కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ నియామకమయ్యారు.
ఎస్సైలు..
కమిషనరేట్ పరిధిలో 17మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. వీరిలో డి.విజయ్కుమార్ హసన్పర్తి నుంచి రాయపర్తికి, రాయపర్తి నుంచి బి.రాజు మడికొండకు, టాస్క్ఫోర్స్లో పనిచేస్తున్న డి.రాజు వీఆర్, స్టేషన్ఘన్పూర్ నుంచి బి.శ్రవణ్ కొండకండ్లకు, దుగ్గొండి నుంచి వి.నవీన్కుమార్ ఐనవోలుకు, ఐనవోలు నుంచి జి.వెంకన్న ఇంతేజార్గంజ్కు, శాయంపేట నుంచి ఈ.వీరభద్రరావు పర్వతగిరికి, పర్వతగిరి నుంచి డి.దేవెందర్ కమలాపూర్కు, మడికొండలో పనిచేస్తున్న ఈ.నరసింహారావు టాస్క్ఫోర్స్, కాజీపేట ట్రాఫిక్కు అటాచ్డ్గా ఆర్.రణధీర్ వరంగల్ ట్రాఫిక్, వరంగల్ ట్రాఫిక్లో పనిచేస్తున్న ఆర్.రామారావు కాజీపేట ట్రాఫిక్, ఇంతేజార్గంజ్ నుంచి జె.నాగరాజు స్టేషన్ఘన్పూర్కు, మీల్స్కాలనీ అటాచ్డ్లో ఉన్న వంశీకృష్ణ టాస్క్ఫోర్స్కు, వీఆర్లో ఉన్న కె.కిషోర్ హసన్పర్తికి, కమలాపూర్ నుంచి వి.చరణ్కుమార్ వీఆర్, వీఆర్లో ఉన్న ఎండీ.రవుఫ్ ఎస్సై 2 పాలకుర్తికి బదిలీచేస్తూ సీపీ ఉత్తర్వులు జారీచేశారు.