వర్ధన్నపేట, డిసెంబర్ 30: మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మనఊరు-మనబడి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులను శుక్రవారం అధికారులు, మున్సిపల్ పాలక మండలి ప్రతినిధులు ప్రారంభించారు. మున్సిపల్ వైస్చైర్మన్ కోమాండ్ల ఎలేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గొడిశాల రవీందర్, కౌన్సిలర్లు పాల్గొని పాఠశాల ఆవరణలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ప్రభుత్వ పాఠశాల సమగ్ర అభివృద్ధికి నివేదిక తయారు చేసినట్లు వారు తెలిపారు. త్వరలోనే పాఠశాలలో ఎంపిక చేసిన అన్ని పనులను పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పద్మ, ఎస్ఎంసీ చైర్మన్ రమేశ్, పులి శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.