గద్వాల నుంచి అయిజకు బస్సు ప్రయాణాన్ని ఎంచుకున్నట్లు తప్పెట్లమొర్సు యువకుడి ట్వీట్
తప్పెట్లమొర్సు యువకుడి ట్వీట్
ధన్యవాదాలంటూ రీట్వీట్ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
గట్టు, మార్చి 27 : ‘వారానికి ఒకరోజు సొంత వాహనానికి సెలవిద్దాం-మన మంచి కోసం, రాష్ట్రం బాగు కోసం, మన టీఎస్ఆర్టీసీ మేలు కోసం’.. అంటూ ఓ యువకుడు ఫేస్బుక్, ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. జోగుళాంబ గద్వాల జిల్లా తప్పెట్టమొర్సు గ్రామానికి చెందిన ఉరుకుందు శెట్టి మిత్రుడి బైక్ అందుబాటులో ఉన్నా.. ఆర్టీసీ బస్సులో గద్వాల నుంచి అయిజకు ఆదివారం ప్రయాణించాడు. అక్కడి నుంచి సొంతూరికి చేరుకున్నాడు. ‘సొంత వాహనానికి సెలవిచ్చా.. ఆర్టీసీ బస్సు ఎక్కాశా’.. మీ సూచన పాటించానంటూ ఆర్టీసీ ఎండీకి ట్విట్టర్లో సదరు వ్యక్తి ట్వీట్ చేశాడు. వెంటనే స్పందించిన ఎండీ సజ్జనార్ ఆర్టీసీని ఎంచుకున్నందుకు ధన్యవాదాలంటూ ట్విట్టర్లో రీట్వీట్ చేశాడు. మోటివేషనల్ స్పీకర్, లైఫ్ స్కిల్స్ ట్రైనర్ అయిన ఉరుకుందు సంతోషం వ్యక్తం చేశారు. అధికారి అంటే ఇలా ఉండాలంటూ కితాబిచ్చాడు.