మహబూబాబాద్ : జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైకుల ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్లపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు కట్టు కాలువ తండాకు చెందిన ఆంగోతు నరసింహ, భూక్యా తరుణ్, కేసముద్రానికి చెందిన చిదురాల చందుగా గుర్తించారు. మరో యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.