మహబూబాబాద్ : 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడులను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు.
అందులో భాగంగా మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు బ్రెడ్లు, పండ్లను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్ల పల్లి రవీందర్ రావు మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, గద్దె రవి,పర్కాల శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ ప్రియాంక, చిట్యాల జనార్దన్, గోగుల రాజు,కె.ఎస్.ఎన్ రెడ్డి, మహబూబ్ పాషా, కన్న, గోపి, రఫీక్ తదితరులు ఉన్నారు.