మహబూబాబాద్ : ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పేదల సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు.
అనారోగ్యానికి గురై అస్తులమ్ముకొని, అప్పులపాలైన పేద వర్గాలకు ఉపశమనంగా ముఖ్యమంత్రి సహాయనిధి బాగా తోడ్పడుతుందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా వివిధ పథకాలను ప్రవేశపెట్టి బలహీన వర్గాలను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో బాలాజీ నాయక్, మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, విజయ్, వెంకటేశ్వర రెడ్డి, వెంకటేష్, భీముడు, భోజ్య, భిక్షపతి, రమేష్, బిక్కు,ఆది రెడ్డి, వంశీ తదితరులు పాల్గొన్నారు.