వేములవాడ, ఆగస్టు 1: రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికులకు ఉపాధి కరువైందని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు, వేములవాడ ఆటో యూనియన్ నాయకుడు చంద్రగిరి శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధిలేకపోవడంతో ఆ టోల కొనుగోలు కోసం తీసుకొచ్చిన అప్పు లు భార్యల మెడలోని పుస్తెలు అమ్మి కడుతున్నామంటూ భావోద్వేగానికి గురయ్యా రు. ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో వేములవాడ సబ్ డివిజన్ ఆటో యూనియన్లో 1,800మంది వీధిన పడగా.. 23మంది మృతి చెందారని గుర్తుచేశారు. ఆటో కార్మికుల ప్రభావం వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఉంటుందని హెచ్చరించారు.
శనివారం వే ములవాడలోని తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆటో కార్మికుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మా ట్లాడుతూ.. వేములవాడ లాంటి పుణ్యక్షే త్రం కావడంతో అంతంత మాత్రంగానే కి రాయి దొరుకుతుందని, మిగతా చోట్ల ఉపాధి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్ర భుత్వం ఎలక్ట్రిక్ ఆటోలను తీసుకొచ్చే ఆలోచన ఉంటే వెంటనే విరమింపజేసుకోవాలని కోరుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అధికారులకు కలిసి వినతిపత్రం అందజేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే తీవ్ర నిరసన తప్పదని హెచ్చరించారు.