గార్ల, డిసెంబర్ 19: గార్ల మండల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.23.09 కోట్లు మంజూరైనట్లు ఇల్లెందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరిసింగ్నాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని వర్తక సంఘం భవనంలో ఎంపీటీసీలు, సర్పంచులు, పీఏసీఎస్ చైర్మన్, వైస్చైర్మన్, బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
డీఎంఎఫ్టీ పథకం కింద 108 బీటీ రోడ్లకు రూ.ఐదు కోట్లు, 165 సీసీ రోడ్లకు రూ. 5.89కోట్లు, ఎన్ఆర్ఈజీఎస్ కింద 75 సీసీ రోడ్లకు రూ.మూడు కోట్లు, నాలుగు బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.5.20కోట్లు, బీటీ రోడ్డు రెన్యువల్కు సీతంసేట -గార్ల- శేరిపురం వరకు రూ.మూడు కోట్లు మంజూరైనట్లు తెలిపారు. దళితబంధు కింద 80 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి ఇద్దరు ఎంపీటీసీలకు ఒక అబ్జర్వర్ నియమించనున్నట్లు పేర్కొన్నారు. 500 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు స్వీకరించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్నాయక్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ పానుగంటి రాధాకృష్ణ, సర్పంచ్ బన్సీలాల్, ఎంపీటీసీ శీలంశెట్టి రమేశ్, మండల కోఅప్షన్ ఖదీర్ బాబా, భాస్కర్రావు, పల్లెబోయిన లింగయ్య, లచ్చునాయక్, గాజుల గణేశ్ పాల్గొన్నారు.