కురవి, నవంబర్ 4 : దేశంలోని అన్ని రాష్ర్టాలు తెలంగాణలో అమలవుతున సంక్షేమ పథకాలతోపాటు వి ద్యా వ్యవస్థను చూస్తున్నాయని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అదిరోహించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మం డల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణలో ఈనె ల ఒకటి నుంచి 4వ తేదీ వరకు ఈఎంఆర్ఎస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలు శనివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతితోపాటు గురుకులాల సెక్రటరీ రోనాల్డ్ రోస్, కలెక్టర్ శశాంక హజరుకాగా, గురుకుల స్కౌట్ విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. త్రివర్ణ జెండా రంగులతో విద్యార్థినులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 23 స్కూళ్ల క్రీడాకారుల మార్చ్ఫాస్ట్ను అతిథులు స్వీకరించారు. విద్యార్థినులతో కలిసి మంత్రి సత్యవతి నృత్యం చేసి ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఏర్పాటు చేసిన మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే గురుకులాల పరిస్థితి మారిందన్నారు.
23 ఈఎంఆర్ఎస్ విద్యార్థులను కలిసే అవకాశం ఇచ్చిన సెక్రటరీ రోనాల్డ్ రోస్కు కృతజ్ఞతలు తెలిపారు. తన చిన్నతనంలో సూల్ లేకపోవడంతో ఎన్నో కష్టాలు పడ్డానన్నారు. తండ్రిలా ఆదరించే సీఎం కేసీఆర్ దయతోనే ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. కురవి గురుకుల అభివృద్ధికి కోట్లు కేటాయించామని, రూ.కోటితో క్రీడా మైదానం నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 183 గురుకులాలు, 339 ఆశ్రమ పాఠశాలలు ఏర్పా టు చేసి నాణ్యమైన విద్యనందిస్తున్నట్లు చెప్పారు. ఈఎంఆర్ఎస్లో సీబీఎస్సీ సిలబస్ ద్వారా విద్యార్థులకు భవిష్యత్ మంచి అవకాశాలు వస్తాయన్నారు. రానున్న స్టేట్ లెవల్ మీట్ గాందారీలో జరుగుతుందన్నారు. గెలువాలనే కాంక్ష.. సంకల్పం.. ఉంటే ఏ రంగంలోనైనా విజయం మీదేనన్నారు. ప్రతి సంవత్సరం 8వేల మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్ది సమాజంలోకి పంపుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని మరిన్ని సేవలందించేందుకు కష్టపడుతున్న సెక్రటరీ రోనాల్డ్ రోస్కు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒకరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం నీట్ కౌన్సిలింగ్లో 41 సీట్లు సాధించారని అన్నారు. 10 శాతం రిజర్వేషన్లతో సీఎం కేసీఆర్ గిరిజనులపై మరోసారి ప్రేమ కనబరిచారన్నారు.
గురుకుల సెక్రటరీ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ… ఈఎంఆర్ఎస్ విద్యార్థులు అత్యంత ప్రతిభ గలవారని అన్నారు. క్రీడల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడుతాయని, వాటితో ముందుకుసాగాలన్నారు. ఈనెలలో ఇంటర్ సొసైటీ లీగ్స్, నేషనల్ లీగ్లో ఆడేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. తెలంగాణ ఈఎంఆర్ఎస్లకు దేశంలో మంచిపేరు ఉందని, దానిని నిలబెట్టుకునేందుకు విద్యార్థులు కృషి చేయాలన్నారు. అందుకు తగ్గట్లుగా అధ్యాపక బృందం ప్రోత్సహించాలన్నారు. బెంగళూరులో జరిగిన నేషనల్స్లో పాల్గొన్న తెలంగాణ విద్యార్థులు 7 అత్యుత్తమ రికార్డులలో 4 బహుమతులను గెలుచుకున్నట్లు తెలిపారు. మీ స్కూల్ నుంచి కృష్ణవేణి, టీచర్గా కుమారస్వామి కొత్తగూడ బహుమతులు పొందారని అన్నారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు. నేషనల్స్ నిర్వహించేందుకు మహబూబాబాద్కు మరో అవకాశం ఇవ్వాలని గురుకులాల సెక్రటరీని కోరారు. ఈ కార్యక్రమంలో జా యింట్ కలెక్టర్ అభిలాషాఅభినవ్, ఐటీడీఏ పీవో అంకిత్, ఎంపీ పీ గుగులోత్ పద్మావతి, జడ్పీటీసీ బండి వెంకట్రెడ్డి, సర్పంచ్ పద్మానర్సింహా రావు, ఎంపీటీసీ భాసర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల గురుకుల ఆర్సీవో రాజ్యలక్ష్మి, ఆర్సీవో వెంకన్న పాల్గొన్నారు.ర
విజేతల వివరాలు
23 పాఠశాలలు పాల్గొన్న క్రీడోత్సవాల్లో 117 పాయింట్లతో బాలానగర్ జట్టు మెగా ఓవరాల్ గేమ్స్, స్పోర్ట్స్ చాంపియన్గా నిలిచింది.
n కబడ్డీ (అండర్-19 బాలికలు) సీరోలు మొదటి స్థానం, ఎల్లారెడ్డిపేట రెండో స్థానం
బాలురు : బాలానగర్, నార్నూర్
ఖోఖో బాలికలు : సీరోలు, ఎల్లారెడ్డిపేట
బాలురు : బాలానగర్, మర్రిమడ్ల
వాలీబాల్ బాలికలు: ఇందల్వాయి, కురవి
బాలురు : టేకులపల్లి, గాంధారి
హ్యాండ్బాల్ బాలికలు : ఎల్లారెడ్డిపేట, కురవి
బాలురు : బాలానగర్, గాంధారి
ఫుట్బాల్ బాలికలు : కురవి, సీరోలు
బాలురు : కల్వకుర్తి, బాలానగర్
బాస్కెట్ బాల్ బాలికలు : కురవి, ఎల్లారెడ్డిపేట
బాలురు : బాలానగర్, గాంధారి
హాకీ బాలికలు : గనుగులపల్లి, ముల్కలపల్లి
బాలురు : బాలానగర్, ముల్కలపల్లి
బ్యాడ్మింటన్ బాలురు సింగిల్స్ : బాలానగర్, గాంధారి
బాలురు డబుల్స్ : కొత్తగూడ, బాలానగర్
ఓవరాల్ చాంపియన్షిప్
అండర్-14 బాలికలు : సీరోలు, అండర్-17 గండుగులపల్లి, అండర్-19లో ఎల్లారెడ్డిపేట