మహబూబాబాద్ రూరల్, జూన్19 : జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. ఈ నెల 3 నుంచి 18 వరకు 15 రోజులపాటు కొనసాగగా, పల్లెల్లో అపరిష్కృతంగా అనేక స మస్యలకు పరిష్కారం లభించింది. దీంతో పాటు ప్రజ లు, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో నిత్యం చేపట్టిన పారిశుధ్య పనుల తో పల్లెలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నా యి. పాడుబడిన బావుల పూడ్చివేత, రోడ్లకిరువైపులా చెత్తాచెదారం, డ్రైనేజీల్లో సీల్ట్ తొలగింపు వంటి పనులు చేశారు.
జిల్లాలోని 16 మండలాలు, 462 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలో 5వ విడుత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వచ్ఛందంగా పాల్గొని గ్రామాలను శుభ్రం చేశారు. మొదటగా మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పాదయాత్ర చేసి సమస్యలను గుర్తించారు. వాటిని ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించారు. ఖాళీగా ఉన్న ప్లాట్లలో చెత్తను తొలగించి మొక్కలు నాటారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిరోజూ గ్రామాల్లో పర్యటించి, చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్లు, మురుగు కాల్వలను శుభ్రం చేయించారు. విద్యుత్ సమస్యలున్న గ్రామాల్లో పవర్ డే పాటించి సమస్యలు పరిష్కరించారు. వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లను వినియోగంలోకి తెచ్చారు. హరితహారం కోసం నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు. గ్రామాల్లో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులను శుభ్రం చేయించడంతోపాటు పైపులైన్ల సరిచేయించి ఇంటింటికీ శుద్ధిచేసిన జలాలు అందేవిధంగా చర్యలు తీసుకున్నారు.
ఇక పల్లెప్రగతి చివరి రోజు గ్రామపంచాయతీల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి పల్లెప్రగతి పనులపై సమీక్షించారు. కాగా, పల్లెప్రగతి పనుల ప్రారంభం నుంచి చివరి వరకు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నిత్యం పనులను పరిశీలించి అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. ముఖ్యంగా పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్ తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బయ్యారం మండలం బాల్యతండాలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రులతోపాటు ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు పాల్గొని పనులు పరిశీలించారు. డోర్నకల్, కురవి, నర్సింహులపేట, మరిపెడ మండలాల్లో ఎమ్మెల్యే రెడ్యానాయక్ నిత్యం పర్యటించి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. మానుకోట, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు మండలాల్లో ఎమ్మెల్యే శంకర్నాయక్ క్రీడా ప్రాంగణాలను ప్రారంభించి, పల్లెప్రగతిని పరిశీలించారు. జిలాల్లోని 16 మండలాల్లో జరిగిన పల్లెప్రగతి పనులను కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ అభిలాషాఅభినవ్ పరిశీలించారు.
పరిష్కరించిన సమస్యలివే..
జిల్లాలోని 462 గ్రామపంచాయతీల్లో అపరిశుభ్రంగా ఉన్న 1,012 డ్రైనేజీలను గుర్తించి, 916 శుభ్రం చేశారు. 325 శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గు 319 ఇళ్లను తొలగించారు. జిల్లాలోని అన్ని ఓహెచ్ఆర్ ట్యాంకులను శుభ్రం చేశారు. 26 పాడుబడిన బావులను గుర్తించి, 23 బావులను పూడ్చారు. 1527 కిలో మీటర్ల మేర రోడ్లు శుభ్రం చేశారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్న 1898 ప్రభుత్వ సంస్థలను గుర్తించి, 1873 సంస్థల ఆవరణలను శుభ్రం చేశారు. 1922 సర్కారు తుమ్మలు, పిచ్చి చెట్లను గుర్తించి, 1,901 చెట్లను తొగించారు. 500దారులను గుర్తించి 460 దారుల్లో గుంతలను పూడ్చారు. విద్యుత్, నీరు, మూ త్రశాలల సౌకర్యం లేని 56 వైకుంఠధామాలను గుర్తిం చి, 40 వైకుంఠధామాల్లో సౌకర్యాలు కల్పించారు. గ్రా మాల్లో థర్డ్పోల్స్ లేని 1810 స్తంభాలను గుర్తించి, 1527 పోల్స్ను ఏర్పాటు చేశారు. 16 మంది దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలకు మౌలిక వసతులు కల్పించారు. 15రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమం లో ప్రజాప్రతినిధులతోపాటు 206 మంది ప్రత్యేకాధికారులు, 19,534 మంది ప్రజలు పాల్గొన్నారు.