తొర్రూరు, జూన్ 5: రాష్ట్రంలో పల్లెల ముఖచిత్రం మారిందని, అన్నిరకాల మౌలిక వసతుల కల్పనకు ము ఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి పనులు చేపడుతూ దేశం మెచ్చే రీతిలో గ్రామాలను తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. ఆదివారం మండలంలోని హరిపిరాల గ్రామ పంచాయతీలో పల్లెప్రగతి కార్యక్రమ నిర్వహణ తీరుపై ఆకస్మికంగా తని ఖీ చేశారు. గ్రామ పొలిమేర నుంచి జీపీ వరకు వీధుల్లో కొనసాగుతున్న కార్యక్రమాల తీరును పర్యవేక్షించారు. పల్లెలను పూర్తిస్థాయి పారిశుధ్య కేంద్రాలుగా మార్చేందుకు ప్రతి నెలా సర్పంచ్లకు నిధులు అందజేస్తున్నామని లిపారు. కొందరు ప్రతిపక్షాల ఉచ్చులో పడి వివిధ కారణాలను చూపుతూ బిల్లుల విడుదల విషయంలో ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక నిధుల విషయంలో ఇబ్బందులు పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. సమైక్య పాలకుల చేతిలో తెలంగాణ దగా పడగా, సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించిన తర్వాత ప్రజల ఆకాంక్షకు తగినవిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. గ్రామంలో విద్యుత్ సిబ్బంది చేపడుతున్న తీగల మరమ్మతులను ఆయన పరిశీలించారు. హరిపిరాల నుంచి కర్కాలకు వెళ్లే దారిలో రోడ్డుపై నిర్మించిన కల్వర్టు దెబ్బతినడాన్ని, చెరువు కట్ట అక్కడక్కడ శిథిలావస్థకు చేరుకున్న తీరును పరిశీలించి వెంటనే ఫోన్లో అధికారులతో మాట్లాడారు.