వివరాలు వెల్లడించిన ఈస్ట్జోన్ డీసీపీ వెంకటలక్ష్మి
హన్మకొండ సిటీ, జూన్9: మహిళపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన నిందితుడిని పర్వతగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఈస్ట్జోన్ డీసీపీ కొల్లి వెంకట లక్ష్మి మామునూరు ఏసీపీ నరేశ్కుమార్తో కలిసి బుధవా రం కమిషనరేట్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. డీసీపీ కథనం ప్రకారం.. మండలంలోని అన్నారానికి చెందిన పోడేటి కృష్ఱ, మేకల రాజు స్నేహితులు. ఈ నెల 4న పంథినికి చెందిన పోడేటి కృష్ణ స్నేహితులు మణి, కుమార్ విందు చేసుకునేందుకు అన్నారం వెళ్లారు. ఈ క్ర మంలో ఒగ్గు కొమురమ్మ(48) కృష్ణ ఇంటికి వచ్చి డబ్బు లు అడిగింది. డబ్బులు లేవని వారు అనడంతో ఆమె వెళ్లి పోయింది. అనంతరం కృష్ణ, రాజు మద్యం తాగుతుండగా కొమురమ్మ మరోసారి వచ్చి డబ్బులు అడిగింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు ఆమెను బలాత్కారం చేయడంతో ప్రతిఘటించింది. దీంతో ఇద్దరు కలిసి రాయితో కొట్టి చం పారు. ఎవరికీ అనుమానం రాకుండా కృష్ణ ఇంటి ఆవర ణలోని సెప్టిక్ ట్యాంక్లో కొమురమ్మ మృతదేహాన్ని వేసి మూసేశారు.
రెండు రోజలు తర్వాత ఈ నెల 6న తన భార్య కనిపించడం లేదని ఆమె భర్త కొమురయ్య పర్వతగిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా తాను ఎలాగైనా దొరికి పోతాననే భయంతో నిందితుడు కృష్ణ ఈ నెల 8న ఉదయం పర్వ తగిరి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. స్నేహితుడు మేకల రాజుతో కలిసి హత్య చేసి సెప్టిక్ ట్యాంక్లో పాతిపెట్టామని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కొమురమ్మ మృతదే హాన్ని బయటకు తీయించి నిందితున్ని రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన మామునూరు ఏసీపీ నరేశ్కు మార్, పర్వతగిరి సీఐ కిషన్, సంగెం ఎస్సై సురేశ్, పీఎస్సై మహేందర్, హెడ్ కానిస్టేబుల్ రమేశ్, కానిస్టేబుళ్లు లింగ మూర్తి, ఎస్ రాజు, వీ రాజు, రమణ, రాజేశేఖర్, నరేశ్ ను డీసీపీ వెంకటలక్ష్మి అభినందించారు.